Sunday, 17 November 2024

పరిణామ సిద్ధాంతం

🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏽‍♂️
*_మనిషి పుట్టింది కోతికా లేక దేవునికా?? మనిషి పుట్టుకకు Darwin సిద్దాంతము సత్యమా??_*

1. ఈ పాఠం మన క్రైస్తవ విశ్వాసానికి చాల అవసరమైనదని చెప్పాలి.నేడు మనము ఉన్న ఈ శాస్త్ర ప్రపంచములలో శాస్త్రానికి ఉన్న బలము Bibleకి లేని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే శాస్త్రాన్ని నమ్మే సంఖ్య ఎక్కువైనది గనుక. శాస్త్రము కంటే bible గొప్పదన్న విషయాలను సమాజానికి చెప్పేవారు లేకపోవటము వలన శాస్త్రము ఆకాశము అంత ఎత్తులో ఈ రోజు సమాజానికి కనపడుతుంది. ఎప్పటికైనా శాస్త్రము, BIBLE ముందు కిందకు దిగాల్సిందే. scientistsకు ఉండే బలము శాస్త్రము (science). ఈ శాస్త్రానికి (science)
పుట్టినిల్లు ప్రకృతి. *ఈ ప్రకృతిని శాస్త్రవేత్తలు చదివారు. అందులోనించి శాస్త్రాలను పుట్టించారు.* భూమి మీద ఉంటున్నారు కనుక భూమిని చదివి భూగోళ శాస్త్రము ( GEOGRAPHY) అను పేరు పెట్టారు, భుగర్బoని చదివి భుగర్బo శాస్త్రము(GEOLOGY) అను పేరు పెట్టారు. భూమి మీద ఉన్న చెట్లను చదివి వృక్ష శాస్త్రము( BOTONY) అను పేరు పెట్టారు.జంతువులను చదివి జంతు శాస్త్రము (ZOOLOGY),పక్షులు చదివి పక్షి శాస్త్రము(ORNITHOLOGY),పండ్లు చదివి పండ్ల శాస్త్రము (CORPOLOGY) పెట్టారు. 

2.కంటికి కనపడుతున్న వాటిని చదివారు. కనపడుతున్నాయి గనుక చదివారు. చదివి అర్థము చేసుకున్న దానికి పేరు పెట్టారు. *కంటికి కనపడే ఒక వస్తువు గురించి అలోచించి, వీళ్ళకు ఏమి అర్థము అయిందో ఆ subject ని ఒక subject గా పిలిచి దానికి ఒక పేరు పెట్టారు.* ఏ ప్రకృతి నుండి శాస్త్రము పుట్టిందో, ఆ ప్రకృతి పుట్టడానికి కారణము మన చేతిలో ఉన్న వాక్యమే. వాక్యము వలన ప్రపంచములు నిర్మాణo అయ్యాయి (హెబ్రీ 11:3). *_ప్రపంచములు (విశ్వము) దేవుని వాక్యము (మాట) వలన నిర్మాణo అయ్యాయి. కనుక వాక్యము వలన ప్రపంచము ఏర్పడితే ,ఏర్పడిన ఆ ప్రకృతిని బట్టి శాస్త్రము అను నామము పుట్టించారు మనుషులు._* శాస్త్రము ప్రకృతి మీద ఆధారపడింది. కానీ ప్రకృతి దేవుని మాట వలన కలిగింది.

3. *_మనిషి జన్మ వెనుక ఎవరు ఉన్నారు? దేవుడా? కోతినా??_*

శాస్త్రవేత్తగా పిలిచే Darwin ఒక సిద్దాంతమును సృష్టించి దాని పేరు Darwin theory అని పేరు పెట్టాడు. ఇందులో మనిషి కోతి నుండి పరిణామము (change) చెందాడు అని చెప్పాడు. *_నిజముగా darwin theory అటు శాస్త్రీయముగా and bible ప్రకారముగా తప్పుగా ఎంచబడింది._* ఇప్పుడు darwin అనగా ఎవరో, అతని చరిత్ర చూస్తే 19వ శతాబ్దము కాలములో యేసుక్రీస్తు వంశావళి అయిన యుదా గోత్రమునకు చెందినవాడు. ఇతను ఒక యుదుడు. ప్రపంచమునకు క్రొత్త విషయము తెలియజేయాలని ఆఫ్రికా కండానికి ప్రయాణించాడు. ఆఫ్రికాలో ఉన్నవారిని ,జంతువులను గమనించాడు. ఆఫ్రికా మనుషుల ఎముకలు, జంతువుల ఎముకలు సేకరించి పరిశోదించడం మొదలుపెట్టాడు. తన పరిశోదన ఫలితముగా మనిషి పుట్టుక వెనుక కోతి ఉంది అని ప్రకటించాడు. నిజముగా ఆఫ్రికాలో ఉన్న వాతావరణము పరిస్థితి వాళ్ళ మనుషుల మొహాలు, కోతుల (chimpanjee, gorilla) మొహాలు దగ్గర దగ్గరగా ఒక్కటిగా ఉండేది. *కనుక Darwin ఇలా అనుకున్నాడు. మొదట కోతిగా, తర్వాత నరకోతిగా, తర్వాత మనిషిగా మర్పుచెందాడని తలిచాడు.*

4. మనిషి వెనుక కోతి ఉంటె, మరి కోతి వెనుక ఎవరు ఉన్నారు? అని అడిగితే కోతి వెనుక కొన్ని జీవులు ఉన్నాయి అన్నాడు. ఆ జీవులు క్రమేనా change అవుతూ కోతి అయింది. ఆ కోతి కొంతకాలము పెరిగి పెరిగి ఆ ముందున్న రెండు కాళ్ళు కాస్త లేవటము మొదలయ్యి , వెనుక తోక ఊడిపోవడము మొదలు అయ్యి చివరిగా మనిషి ఇలా మరిపోయడని చెబుతున్నాడు..

🤣చాలా విడ్డురముగా ఉంది కదూ.. *మరి సృష్టి ఎలా ఏర్పడినది?* అని అడిగితే ఒక వస్తువు ప్రేలడము వలన జరిగింది అని అంటున్నాడు. ప్రేలి అందులో నుంచి ముక్కలు ముక్కలుగా అంతట విస్తరించి కాలక్రమేనా ఒక్క ముక్క sunగా, ఒక ముక్క moonగా, ఒక ముక్క భూమిగా, ఒక ముక్క జీవిగా, ప్రారంభమైనదని చెబుతున్నాడు. ఇక్కడ అద్భుతమైన సంబ్రమాచర్యాలకు గురి చేసే, శాస్త్రానికి దిమ్మ తిరిగే ప్రశ్న ఏమంటే.. *_ప్రేలే వస్తువు ముందుగా ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు??_*🤔🤣

5. పరిణమము చెందుతూ మనిషి వచ్చాడే తప్ప మొదటిలో మనిషి లేడు అని ప్రకటించాడు. ఇప్పుడు కొంత సమయము వరకు పరిణామ సిద్దంతము correct అనుకుందాము. మొదటగా *పరినామము అనగా మార్పు.* అనగా మార్పు చెందుతూ ఉండాలి. కోతి మార్పు చెందుతూ చెందుతూ మనిషిగా మారాడు అని darwin అంటున్నాడు కదా! మరీ *__మనిషి కూడా మార్పు చెందుతూ చెందుతూ ఏదో ఒక రుపములోకి పరిణామము చెందాలిగా?? మనిషి ఎందుకు మనిషి దగ్గర ఆగిపోయాడు??కోతి మనిషిగా పరిణామము చెందితే, మనిషి ఏ విధముగానో పరిణామము చెందాలిగా??._* నిజముగా మనిషి ఏదో ఒక రూపముగా మారితే అప్పుడు కోతి నుంచి వచ్చాడని నమ్మొచ్చు. *_పరిణామము మనిషి దగ్గరకు రాగానే ఎందుకు ఆగిపోయింది??_* దీనికి సమాధానం శాస్త్రం వద్ద లేదు.ఇలాంటి వన్ని తప్పుడు సిద్దంతములు.

6. దీనిని పట్టుకుని హేతువాదులు.. మనుష్యులు పుట్టింది కోతి ద్వారా అయితే మరి దేవుడెక్కడా?? అని దేవుడు లేడు అంటున్నారు.

🎊 *_సృష్టి దానంతట అదే ఏర్పడినదని అంటున్నారు._*

👉మా ఇల్లు దానంతట అదే ఏర్పడింది అని అంటారా?
👉నా bike దానంతట అదే ఇంటి ముందుకు వచ్చిందని అంటారా??
👉ప్రేలుడు వల్ల ఏర్పడుతాయా లేక కలుగుతాయా??
👉ప్రేలుడు వల్ల ఉన్నవి పోతాయా? లేక లేనివి వస్తాయా??
👉మా ఇల్లు ప్రేలుడు ద్వార ఏర్పడింది అని అంటామా??
👉Hyderabad, Delhi, Mumbai లో జరిగిన ప్రేలుడు ద్వార ఉన్నవి పోయాయా లేక లేనివి కలిగాయా??

సృష్టి ప్రేలుడు వాళ్ళ కలిగిందని విశ్వసిస్తున్నారు. పిల్లి, పులి ఒకేలాగా ఉంటాయని పులి, పిల్లి నుంచి వచ్చిందని, కుక్క, నక్క ఒకేలా ఉంటాయని కుక్క నక్క నుంచి వచ్చిందని darwin అంటున్నాడు.

7. ఇప్పుడు bibleను అడిగితే..
A. (ఆది 1:11-)
దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము మొలిపించుగాక ....... ఇక్కడ తమ తమ జాతి ప్రకారము అంటున్నాడు.

*Ex*
mango seed వేస్తే futureలో mango tree వస్తుందని, అలానే చింతపిక్క ,భోప్పాయి seeds ఇలా ఏజాతి seed వేస్తే ఆ జాతి మొక్కలే వస్తాయని మనకు తెలుసు.

B. (ఆది 1:21-)
దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము..... ఇక్కడ కూడా వాటి వాటి జాతి ప్రకారము అని అంటున్నాడు. సముద్రములో చేప కడుపునా చేపగా,తిమింగలము కడుపునా తిమింగలము గా వస్తున్నాయి.

C. (ఆది 1:25-)
దేవుడు ఆయా జాతుల ప్రకారముగా పశువులను ,అడివి జంతువులను ,నేల మీద పరాకు ప్రతి పురుగును చేసెను. Bible లో చెప్పినట్లుగా ,ఉన్నట్లుగా జరుగుతుంది . అనగా ఏ జాతి నుంచి ఆ జాతివి ఏర్పడతాయి. *_కానీ ఒక జాతి నుంచి అన్ని జాతులు ఏర్పడలేదు._* (ఆది 2:19) దేవుడైన యెహోవ ప్రతి భుజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికీ ఏ పేరు పెట్టునో అని అతని యొద్దకు వాటిని రాప్పించెను. (ఆది1:26-) మనిషి నిర్మాణము రాగనే ఒక ప్రత్యేకత. సృష్టిలో ఉన్నవి అన్ని తన మాట ద్వార నిర్మిస్తే మనిషిని మాత్రమూ మట్టితో శరీర ఆకారము చేసి తన ఆత్మను ఇచ్చాడు.

8. *_ఏది పరిణామము మరి???_*

ఎవరైనా కోతి పనులు చేస్తే.. వాడిని కోతి అని తిడితే.. కోపపడుతాడు. *_అయితే ఇప్పుడు ఉన్న మనుషులంతా కోతులేనా??_* మరీ మనం చూస్తున్న కోతులు కోతులుగానే ఉన్నాయి, మనము మనముగానే ఉన్నాముగా!? కోతులు మారడము లేదు, మనమూ మారడము లేదు. *_ఏది పరిణామము మరి???_* కోతి నుంచి వచ్చాను అని ఎవడు అంటాడో.. వాడి ఇంటిలో కోతిని కట్టేయాలి. *_ఎవరైనా కోతి అని పిలిస్తే , పేరు పెడితే, కోతిని తెచ్చి ఇంట్లో పెడితే ఇష్టపడతారా???_*

ప్రపంచములో సుమారు 280 దేశాలున్నాయి. ప్రతి దేశానికి ఒక జాతీయ జంతువు పక్షి ఉంటుంది. కానీ *_ఏ దేశమైన జాతీయ జంతువుగా కోతిని ఎందుకు పెట్టుకోలేదు???_* ఎవడైతే కోతి నుంచి వచ్చాము  అంటున్నాడో *_వాడికి Accident అయితే అత్యవసరముగా కోతి రక్తము తీసి ఎక్కించాలి. నిజముగా మనిషి కోతి నుండి వస్తే, ఆ కోతి రక్తము మనిషికి ఎక్కిస్తే మనిషి బ్రతుకుతాడా?????_* చచ్చిపోతాడు. అస్సలు కోతి మాంసము వేరు మనిషి మాంసము వేరు. (1 కొరంది 15:38-) మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు,చేప మాంసము వేరు.... కనుక *_మాంసము వేరు అయితే మనిషి కోతి నుండి ఎలా వస్తాడు???_* ఒకవేళ వస్తే.. కోతి మాంసము, మనిషి మాంసము వొకే విధంగా ఉండాలి కదా!?

9. *_మనిషి పుట్టుక వెనుక కోతి లేనప్పుడు, మనిషి పుట్టుక వెనుక ఎవరు ఉన్నారు??_*

(అపో 17:26-) యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి........ వకని నుండి అనగా మానవుని నుండి గానీ కోతి అని వ్రాయబడలేదు. గనుక మనుష్యులందరి వెనుక ఉన్నది మనిషి అని అర్థమైనది. అనగా కోతికి కోతి, పులికి పులి, కుక్కకు కుక్క, పిల్లికి పిల్లి, మనిషికి మనిషే పుడతాడు. ఒకని నుండి మనమంతా వచ్చాము. ఆ ఒక్క మనిషి ఆదాము. కనుక *మనమంతా ఆదాము నుండి వచ్చిన వారము.* మనము పుట్టుక ముందు ఆదాములో ఉన్నాము.

*ఉదా:-*
మధు పుట్టక ముందు.. మధు తన తండ్రి లో ఉన్నాడు. తన తండ్రి వాళ్ళ తండ్రి లో ఉన్నాడు. ఇలా వెనక్కి వెళ్లిపోతే...చివరకు *_అందరమూ ఆదాములో ఉన్నాము. మరి ఆదాము పుట్టక ముందు ఎవరిలో ఉన్నాడు??_*

నేను
నాన్న
తాత
ముత్తాత
అబ్రాహాము
ఇస్సాకు
యాకోబు
ఆదాము
????

10. *_ఆదాము ఎవరి కుమారుడు??_*

(లుకా 3:38)
*_ఆదాము దేవుని కుమారుడు._* మనము కూడా దేవుని కుమారులమే. ఆదాము మరియు మనము పుట్టక ముందు.. దేవునిలో ఉన్నవారము. అనగా *_మనిషి పుట్టింది దేవునికి,_* కానీ కోతికి కాదు.

🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍🚶🏾‍♂️🦍

Tuesday, 25 June 2024

పోగుచేయుట

పోగుచేయును అంటే, 
పైన మొత్తం అలంకార బాషా వాడిన యేసు ఇక్కడ
Matthew(మత్తయి సువార్త) 24:31

31.మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన *ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.* 

పాత నిబంధన కాలములో,
Numbers(సంఖ్యాకాండము) 10:1,2

1.యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు *రెండు వెండి బూరలు చేయించుకొనుము* ; 
2.​నకిషిపనిగా వాటిని చేయింపవలెను. *అవి* *సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.* 



Leviticus(లేవీయకాండము) 25:9,10

9.ఏడవ నెల పది యవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థదినమున మీ దేశమంతట *ఆ శృంగనాదము చేయవలెను.* 
10.మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; *అది* *మీకు సునాదముగానుండును* ; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

Isaiah(యెషయా గ్రంథము) 27:12,13

12.ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలు కొని ఐగుప్తునదివరకు యెహోవా తన ధాన్య మును త్రొక్కును. *ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.* 
13. *ఆ దినమున పెద్ద బూర ఊదబడును* అష్షూరుదేశములో నశింప సిద్ధమైనవారును ఐగుప్తుదేశములో వెలివేయబడినవారును,వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధపర్వతమున యెహో వాకు నమస్కారము చేయుదురు.

బూర ఊడటం అంటే gathering/సంకుర్చుట...యేషయా 27 లో ఇక్కడ చెదిరిన ఇజ్రాయెల్ ప్రజలను సమకూర్చటానికి ఉపయోగించబడింది..
ఇది ఎప్పుడు జరుగును???



Isaiah(యెషయా గ్రంథము) 27:9,10

9.కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయ శ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాపపరిహారమునకు కలుగు ఫలము. *ఛిన్నాభిన్నములుగా చేయబడు సున్నపురాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటిని కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు.* 
10. *ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన* నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును. 

యెరూషలేము నాశనము ను సూచిస్తుంది.
1 కోరంతి 15 లో ఉదబడిన కడబూరా, Mat 25 లో బూర మ్రోగగానే, gathering/పొగుడుకోవడానికే జరగటం..
ఇవన్నీ చూస్తే
దేవుని బూర ఊదినప్పుడు, చెదరినా ఇశ్రాయేలు కూడగట్టబడతారని యెషయా చెప్పాడు. 
ఇది gathering of remanant/శేషము గురించి మునుపటి మెస్సియానిక్ వాగ్దానాన్ని సూచిస్తుంది.


Isaiah(యెషయా గ్రంథము) 11:11,12

11.ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు *విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును* 
12. *జనములను పిలుచుటకు* ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన *ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.* 
ఇది క్రీస్తు లో జరిగే కార్యము..
ఇది బూర ఊడినప్పుడు జరిగే restoration language.

1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:51,52

51.ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, *కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము.* 
52. *బూర మ్రోగును* ; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. 

ఇది restoration MAT 24:31.

Matthew(మత్తయి సువార్త) 24:31

31.మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి *ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.*

ఇది దానియల్ పునరుత్థానం మరియు జెరూసలేం నాశనం కు connect చేయబడింది..

 Daniel(దానియేలు) 12:1,2,7

1. *ఆ కాలమందు* నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు *మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును* ; అయితే *నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.* 

2.మరియు *సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును* , కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. 

👆ఇది ఎప్పుడు జరుగును???

7.​నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము *పరిశుద్ధజనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను* . 

 *యూదుల/ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పరిశుద్ధ ప్రజలు వారి బలము కొట్టివేయడం సమాప్తమైన తరువత.* 12 : 1-2, పునరుత్ధానం ఎప్పుడు జరుగును అంటే, 12: 7 *యూదుల బలము కొట్టివేయబడటం లో అన్ని నేరవీరుని దూత చెప్పటం జరిగింది.* 



Luke(లూకా సువార్త) 21:27,28,31

27.అప్పుడు మనుష్యకుమారుడు *ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు.* 
28.ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. 
31.అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. 

*ఆకాశ మేఘరూఢుడై రావడం లో* 
*వారి విమోచన కు link* *అయివుంది** .*
 *అలాగే దేవుని రాజ్యము కు link అయి ఉంది.***

రాకడ 2

MArk 14:61-62//Mat16:26-27 // 2thess 1//

Matthew(మత్తయి సువార్త) 16:27,28

27. *మనుష్యకుమారుడు* *తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు.* అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును. 
28.ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, *మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.* 

2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 1:6,7,8,10

6. *ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,* 
7.దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు 
8.మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 
10.ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.

రాకడ

*యేసు తండ్రి మహిమ గలవాడై రావడం అంటే* 

 *తండ్రి ఏ విధంగా ఉన్నాడో/వచ్చాడో ఆ విధంగా నే.* 

*దేవుడు "మేఘాలపై" రావటండం అంటే , దేవుని  ప్రజలను రక్షించడంలో మరియు దేవుడు శత్రువులను తీర్పు తీర్చడం ను సూచిస్తుంది..* 

 *దేవుడు మేఘాలపై రావడం అంటే:* 

Exodus(నిర్గమకాండము) 16:10

10.అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, *అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.* 

Exodus(నిర్గమకాండము) 19:9

9.యెహోవా మోషేతోఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచు నట్లు *నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను.* మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా 

Exodus(నిర్గమకాండము) 34:5

5. *మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను* . 

Leviticus(లేవీయకాండము) 16:2

2.​నేను కరుణాపీఠము *మీద మేఘ ములో కనబడుదును* గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. 

Numbers(సంఖ్యాకాండము) 11:25

25 *.యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి* అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు. 


 *మేఘాలలో రావడం యెహోవా ఉనికిని/సన్నిధి ని సూచిస్తుంది. ఇది దేవుని  రక్షణ కూడా సూచిస్తుంది.* 

 *రక్షణ ను తెలియజేస్తుంది.:::* 

Psalms(కీర్తనల గ్రంథము) 18:9,10,11,12,13,14

9.నిప్పుకణములు రాజబెట్టెను. *మేఘములను వంచి ఆయన వచ్చెను*
 ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను. 
10.కెరూబు *మీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.* 
11.గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెను జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను. 
12.ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను. 
13.యెహోవా ఆకాశమందు గర్జనచేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లును మండుచున్న నిప్పులును రాలెను. 
14.ఆయన *తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా* మెరపించి వారిని ఓడగొట్టెను. 


Isaiah(యెషయా గ్రంథము) 19:1

1. *ఐగుప్తును గూర్చిన దేవోక్తి*

 *యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు*

 *ఐగుప్తు* విగ్రహములు ఆయన సన్నిధిని *కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది*


 *దేవుడు తీర్పులో ఈజిప్టుకు మీదకి వచ్చాడు.*

 *ఇక్కడ దేవుడు physical గా మేఘాలు ఎక్కి వచ్చాడా???* 
 *లేదు* .

అపోకలిప్టిక్ భాషని ఉపయోగించి, 

అలాగనే ezypt మీదకి వచ్చాడు.


Nahum(నహూము) 1:3

3.యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, *యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు;*

 *మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి.* 

Nahum(నహూము) 1:5,6

5.ఆయనకు భయపడి *పర్వతములు కంపించును* , *కొండలు కరిగిపోవును,*
 *ఆయన యెదుట భూమి కంపించును,* 
లోకమును అందలి నివాసులందరును వణకుదురు. 
6. *ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు?* ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? *ఆయన కోపము అగ్నివలె పారును* , *ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.*


 నీనెవే నాశనం చేయబడిందని మనకు తెలుసు,  *కానీ దేవుడు పరలోకం  నుండి మేఘాల మీదికి రావడం* వల్ల కాదు,* 
 *కల్దీయులను రేపి వారిమీదికి పంపాడు** .* 


 *ప్రధాన యాజకుడు కాయీపా తో.* 
Mark(మార్కు సువార్త) 14:61,62

61.అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి *ప్రధాన యాజకుడు*  పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా 
62.యేసు అవును నేనే; మీరు మనుష్యకుమారుడు *సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.* 

 *మేఘాలపై వచ్చేది యెహోవా దేవుడు,* 

కానీ యేసు ప్రభువు చెప్పిన దానికి అర్థం అయి *ఆ ప్రధాన యాజకుడు  బట్టలు చింపుకుని దేవా దూషణ చేసాడు అని భావించి  మరణ దండన వేయమన్నాడు.*

కీర్తనల గ్రంధము

అందరికి యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు🙏 తండ్రైన దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించి చున్నాను 

కీర్తనలు గురించి ముందు మాట 

స్తోత్రములు /స్తోత్రముల పుస్తకము అని హెబ్రీ లో *తెహిల్లీ* / *సెఫర్ తెహెల్లీ* నుంచి వచ్చింది 

ప్రార్ధనలు గల పుస్తకం అర్ధము హెబ్రీ లో *తెఫిల్లత్* అని

 తంతి వాయిద్యములతో పాడదగిన *గీతము* అనే అర్థము ఇచ్చు *సామాన్* సెప్టువజింటు *LXX* నామమునుండి PSALMS *సామ్స్* అని ఇంగ్లీష్ పేరు వచ్చింది 

కీర్తనలు లలో దాదాపు 1000 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్ర చూపుతున్నది 

ఇశ్రాయేలు గురించే చర్చ కాకుండా సర్వ మానవాళి తెలుసుకో వలసినది సృష్టి కర్త అయిన నిజ దేవుడు ఒక్కడే నని చర్చ కీర్తనలు లో చూస్తాము 

కీర్తనలు ఐదు భాగాలుగా విభజించి ఒక ఒక భాగము యొక్క సారాంశము ను పరిశీలిస్తు అందులో సత్యాన్ని గ్రహించాలని ప్రార్థన 🙏
దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు 5 గ్రంధములు ఇచ్చేను దానికి ప్రతిగా దేవుడు దావీదు ద్వారా 5 భాగములు గల *స్కాంధములు* గల కీర్తనలు వారికి అనుగ్రహించేను 

*మొదటి భాగం* –
 కీర్తనలు 1-41 ఇది ఆది కాండము ను బోలినది ప్రతి *మానవాళికి* సంబంధించినది 

*రెండో భాగం* – 
కీర్తనలు 42-72 నిర్గమ బోలినది *విమోచనకు* సంబంధించినది 

*మూడో భాగం* –
 కీర్తనలు 73-89 లేవీ.. బోలినది *పరిశుద్ధాలయమునకు* సంబంధించినది 

*నాలుగో భాగం* –
 కీర్తనలు 90-106 సంఖ్యా... బోలినది *అశాంతి ప్రయాణములకు* సంబంధించినది 

*అయిదో భాగం* – కీర్తనలు 107-150 ద్వితీయో ... బోలినది 
*దేవుని వాక్యమునకు ప్రాధాన్యము* సంబంధించినది 

ఐదు భాగములలో 
*వాగ్దానాలు, ఆదర్శ ప్రార్థనలు* 

*దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు ఇచ్చే కారణాలు* ఏమిటో పరిశీలిద్దాము   

ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న ముఖ్య ఉద్దేశమే కీర్తనలు యొక్క సారాంశము 

అంతే కాదు పరిశుద్ధాత్ముడు సహాయము లేకుండా దేవుని చిత్తము ను / సంకల్పమును / ప్రణాళిక ను అర్ధం చేసుకోలేము

ఇంకా ఉంది....

Wednesday, 19 June 2024

నిజమైన దేవుడు ఎవరు?

⁉️ *1 యోహాను 5:20 లో “నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నది” ఎవరు?*
——————————————

‼️ *1 యోహాను 5:20 లో “నిజమైన నిత్యజీవమునై యున్నది” ఎవరు?*

☘️ *మనలను రక్షించాలన్నది, మనకు నిత్యజీవము ఇవ్వాలన్నది దేవుని సంకల్పము* (ఎఫెసీయులకు 1:4-6; 1 థెస్సలొనీకయులకు 5:9; యోహాను 3:16).

☘️ *దేవుని ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానని యేసు అన్నాడు* (యోహాను 12:50).

☘️ *అనగా యేసు మాటలన్నియు (ఆజ్ఞలన్నియు) దేవుడు చెప్పమన్న మాటలే* (యోహాను 7:16; 8:38; 12:49-50; హెబ్రీయులకు 1:1,2).

☘️ *అందుకే అపోస్తలులు “దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము (ఆ దేవుని మాటలు) ఆయన కుమారుని యందున్నది (1 యోహాను 5:10)” అని సాక్ష్యమిచ్చారు.* 

☘️ *యేసు మాటలే సత్యము, యేసు మాటలే దేవుని యొద్దకు మార్గము, యేసు మాటలే జీవము (యోహాను 14:6; 6:63).* 

🔥 *యేసు మాటలలో నిత్యజీవమున్నప్పటికి, ఆ మాటలు తండ్రివైనప్పుడు నిజమైన నిత్యజీవము తండ్రి మాత్రమే (యిర్మీయా‬ ‭10:10; దానియేలు‬ ‭6:26).* 
——————————————

‼️ *1 యోహాను 5:20 లో “నిజమైన దేవుడునై యున్నది” ఎవరు?*

☘️ *సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవుడు (1 తిమోతికి 1:17) సర్వశరీ రులకు దేవుడు (యిర్మియా 32:27).*

❓ *యేసు మాటలలో సత్యవంతుడు ఎవరు?*
👉 *తండ్రియగు దేవుడు* (యోహాను 3:33; 7:18; 7:28;) 

❓  *పౌలు మాటలలో సత్యవంతుడు ఎవరు ఎవరు?*
👉 *తండ్రియగు దేవుడు* (రోమా 3:4, 15:8; 1 థెస్సలొనీక 1:9) 

❓ *ఎవరిని ఎరుగవలేనని దేవుని కుమారుడు మనకు వివేకము అనుగ్రహించ్చాడు?*
🆚 1 యోహాను 5:19 *మనము సత్యవంతుడైన వానిని (తండ్రియగు దేవున్ని) ఎరుగవలెనని దేవుని కుమారుడు (యేసుక్రీస్తు) వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము.*
🔥 *తండ్రియగు దేవున్ని ఎరుగవలేనని యేసుక్రీస్తు మనకు వివేకము అనుగ్రహించాడు.*

☘️ *క్రీస్తు దేవునియందును, మనము క్రీస్తుయందును ఉంటే (యోహాను 10:38; యోహాను 14:20), మనము దేవునియందు ఉన్నట్టే కదా..!!* *ఇదే విషయమే క్రింది వాక్యములో వివరించబడింది.* 

🆚 1 యోహాను 5:20 *మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని (తండ్రియగు దేవుని) యందున్నాము.* *ఆయనే(తండ్రియగు దేవుడే) నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.*
🔥 *అందుకే మనము క్రీస్తుయందున్న వారమై తండ్రియగు దేవుని యందు ఉన్నాము అని అంటున్నాడు.*
🔥 *ఆయనే అనగా తండ్రియగు దేవుడే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు అని ఈ వాక్యభాగము యొక్క అర్థము.*

☘️ *ఇదే విషయాన్ని పాతనిబంధనలో కూడా వ్రాయబడింది*
🆚 యిర్మీయా‬ ‭10:10 *యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు.*
🆚 ‭దానియేలు‬ ‭6:26: *ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు..*
——————————————

🔥 *కాబట్టి తండ్రియగు దేవుడు మాత్రమే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.*
☝️సమస్తమును పరిశీలించి మేలైనదానిని చేపట్టుడి 👏

Thursday, 25 April 2024

దేవుడు తండ్రీ

*యేసుక్రీస్తు పుట్టక ముందు* 

*పాత నిబంధనలో*
 
*దేవుడు తండ్రీ గా అయన ప్రజలు కుమారులుగా*
 

యెషయా 64:8
యిర్మీయా 31.9
మాలాకి 1:6
నిర్గమ 4:22,23
ద్వితీయోప 14:1
యెషయా 1:2
హోషేయ11.1
మత్తయి 2.15
యోహాను 8 :41
లూకా 3:38


Thursday, 29 February 2024

సమాధాన పడటం

*ప్రశ్న:-*

*నేను సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నా.,,*
*నా సహోదరుడు నాతో సమాధాన పడకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి..?*

*జవాబు*

ఏం తప్పు చేసి నీవు సమాధానం కోరుకుంటున్నావు ?
నీ సహోదరుడు నీతో సమాధాన పడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?

సమాధాన కర్తయగు దేవుడు మనతో సమాధాన పడాలని ఆయన చాలా మెట్లు దిగి వచ్చాడు

దేవుడు నీతో సమాధాన పడటం కోసం...
*1.* నీ పాపము నీ మీద మోపడం లేదు *(2కొరిం 5:19)*
*2.* నీ పాపానికి శిక్ష ఆయన విధించడం లేదు 
*3.* నీ పాపానికి పరిహారంగా రాయబారులను పంపించాడు 
*4.* నీ పాపానికి శిక్షవిధించుట కొరకు ఆయన తను వాగ్దానం చేసిన మెస్సియను పంపించాడు
*(రోమా 5:1-11; కొల 1:19-22; ఎఫె 2:14-19)*

సమాధాన పడడానికి రాయబారం చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. 
క్రీస్తు రాయబారం వలన మనము దేవునితో సమాధానపడుచున్నాము,

*లూకా14: 31-32* మరియు ఏ రాజైననూ మరియొక రాజుతో యుద్దము చేయబోవు నప్పుడు తన మీదికి 20,000 మంది తో వచ్చు వానిని, పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా ? 
శక్తి లేని యెడల దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాదానము చేసుకొనచూచును కదా..!

నీ సహోదరుడు నీతో సమాధానపడటానికి నీవేమి ఏమేమి చేశావు ?
చిత్తశుద్దితో సమాధాన పడటం కొరకు ప్రయత్నించు. 
నమ్మకమైన రాయబారిని నియమించుకో.
సమాధానపడటంలో క్షమాగుణము అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది.

రోమా పత్రిక

*రోమా పత్రిక* 

*కాలము* - క్రీ॥శ॥ 57-58
*గ్రంధకర్త* - అపో॥ పౌలు

*రోమాలో సంఘాన్ని స్థాపించినవారెవరు ?*

పేతురు, పౌలు అనే ఇద్దరు అపోస్తలులు రోమాలో హతసాక్షులు గా చేయబడినా వారిలో ఏ ఒక్కరు కూడా స్వయంగా రోమా సంఘాన్ని స్థాపించిన వారు కారు

మరి రోమ సంఘాన్ని ఎవరు స్థాపించారు.?

పెంతుకోస్తు దినాన యెరూషలేము లో మార్పు పొందినవారిలో ఎవరైనా అక్కడ సంఘ ప్రారంభానికి సాధనములుగా ఉండి ఉండవచ్చు (అపో. 2:10)
 లేదా పేతురు, పౌలుల పరిచర్యవలన మార్పు చెందిన వారిలో ఎవరైనా రోమాలో క్రీస్తు సంఘపు ఏర్పాటుకు దోహదపడి ఉండవచ్చు 

*రోమా సంఘంలో సభ్యులు ఎవరు..?*

 సభ్యత్వం ప్రధానంగా అన్యజనులలోనుండి వచ్చిన వారితో కూడినదై యుంది 
(రోమా 1:13; 11:13; 15 15 -16)

అంతకు ముందుగా స్థాపించబడి లోక వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న సంఘములో పరిచర్య చేయాలనే ఆశతో పౌలు ఈ ఉత్తరాన్ని వారికి ముందుగా పంపినట్లు తెలియజేయబడుతుంది (రోమా 1:8) 

*ఎక్కడనుండి వ్రాయబడినది ?*

ఇది కొరింధు నుండి వ్రాయబడింది పాలస్తీనాలోని పేదలైనవారి కొరకు చందా పోగు చేస్తున్న కాలంలో వ్రాయబడింది 
(రోమా 15: 14 -17)

రోముకు వెళ్ళి అక్కడనుండి స్పెయిన్ ప్రయాణం సాగించాలనే సంకల్పంతో ఉన్న దినాలవి. (రోమా 15 :24)
యెరూషలేములో తాను బంధింపబడినందున ఈ ఏర్పాటుకు అంతరాయం కలిగింది

*ఈ ఉత్తరంఎవరి ద్వారా పంపబడినది ?*

కెంక్రేయ నుండి తన స్వకార్యం మీద రోమాకు వెళుతున్న *ఫీబే అను సహోదరి ద్వారా* ఈ ఉత్తరం పంపబడినట్టుంది. (రోమా 16:1)

తాను లోకమందు సందర్శించిన సంఘములోని 26 మంది సహోదర, సహోదరీల పేర్లు ప్రస్తావించాడంటే అక్కడ ఉన్న ప్రజలను తాను ఎంతగా ఎరుగునో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది.  

*చర్చనీయాంశం*

*నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును* అనేది ఈ రచన చర్చనీయాంశమైంది

*ఉద్థేశ్యము*

 ఏ భేదము లేకుండా, క్రీస్తు శరీరమైన సంఘములో ఏకశరీరంలోని అవయవాలుగా బంధింపబడి ఉండాలనేది ఈ రచన ఉద్దేశ్యమై ఉంది.

 అందరూ ఆ శరీరంలో ఏకముగా క్రీస్తు ప్రభువు యొక్క సమరూపానికి మార్చబడాలి. 
ధర్మ శాస్త్రము వలన యూదులు, అన్యజనులనే భేధము, దానివలన కలిగిన ద్వేషము క్రీస్తు శిలువయందు అంతము చేయబడి, పాపము సకల జనులను ఏకముగా కట్టి పడవేసి నందున అందరూ క్రీస్తునందు ఏక శరీరమునకు మల్చబడిన వారై ఉంటారు


బైబిల్ అంటే...

*బైబిల్ మాత్రమే దేవుని గ్రంధమా* . . .


బైబిలు (Bible) అనే పేరు "బిబ్లోస్" అనే గ్రీకు రూపంనుండి వచ్చింది.

బిబ్లోస్ అనే పదానికి - గ్రంథమని అర్ధం. ప్రాచీన సాహిత్యంలో యింతకు మించిన గ్రంథం లేదనే భావంతోనూ, గ్రంథమని పిలువబడే ధన్యత దానికి మాత్రమే చెందుతుందనే ఉద్దేశంతోనూ, దాన్ని"బైబిల్" లేక గ్రంథం అని అన్నారు.


 రామాయణం, మహాభారతం, మహాభాగవతం అనేవి గ్రంథాల పేర్లు, కాని బైబిలనేది గ్రంథం పేరు కాదు. తిరిగి చెప్పాలంటే - అసలు గ్రంథమనబడేది అదేనట - అందుకే దాన్ని బైబిలన్నారు.


బైబిలు 66 పెద్ద, చిన్న ప్రత్యేక రచనల చేరికయై ఉండి కూడా ఏక గ్రంథంగా భావించబడడమే దాని ప్రత్యేకత. 

అంటే బైబిలు రచనలో సుమారు 40 మంది కలాలు ఆడినా, 

ఒకని రచనగానే అది భావింపబడడం వింతయే! రమారమి 1600 సంవత్సరాల కాలం రచనలో ఉండి కూడా ఒకే సమయంలో వ్రాయబడినట్టు భ్రమింపజేసే గ్రంథం బైబిలు. ఎన్ని దేశాలను, నాగరికతలను అది దాటివచ్చినా, ఎన్ని కలాలు అందులో ఆడినా, ఏ యే కాలాలలో అది వ్రాయబడినా, నేటి ప్రజల పరిస్థితులకు కూడా దాని సందేశం "వర్తిస్తుంది" అనేది ప్రసంశనీయం. ఇలాటి బైబిలంటే....*


బైబిలు క్రైస్తవ మత గ్రంథమనే తలంపు అనేకుల్లో గూడుకట్టుకొని ఉంది. అయితే అది సరియైన తలంపా? కాదు. అయినా, వాటిని మతాలని పిలవడం సమంజసమైతే రెండు వేర్వేరు మతాలకు చెందియూ, ఒకే గ్రంథంగా రూపొందింది - బైబిలు. అంటే, యూదులు, క్రైస్తవులనే రెండు వేర్వేరు జనాలను మతాలని భావించితే, ఆ రెండింటికి చెందియూ ఏక గ్రంథంగా భావింపబడుతున్న గ్రంథం - బైబిలు.


క్రైస్తవ్యం (Christianity) అనే పేరుతో వాడుకలో ఉన్న మత ప్రపంచాన్ని విమర్శించాలని కంకణం కట్టుకొన్న కొందరు - బైబిలును క్రైస్తవ మత గ్రంథమనే అపోహతోనే దాన్ని చిన్నా భిన్నాలుగా తుంచి, తమకు యిష్టం వచ్చిన చోట అతికించి, బైబిలును అపార్ధం చేశారు. బైబిలును అనుసరిస్తున్నామని చెప్పకొనే కొందరైతే తమకు నచ్చిన చోట చదివి, దాన్ని తమకు వర్తింపజేసికొంటూ అది సరియని అనుకొంటున్నారు. అలా చేయడం వారికి బైబిలునందలి విశ్వాసమో, భక్తో తక్కువై కాదు; కాని బైబిలును గూర్చి వారికి సరియైన అవగాహన లేనందుననే అలాటి పొరపాటు చేస్తున్నారు.


*నిజానికి బైబిలు రెండు వేరైన నిబంధనలతో కూడిన గ్రంథం.*  మొదటిది పూర్వ కాలంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చేసిన నిబంధన. దాన్ని “పాత నిబంధన" అని అంటారు (హెబ్రీ. 8:13). ఇశ్రాయేలీయులు దైవ రాజ్యంగా ఉండడానికే ఆ నిబంధన చేయబడింది (నిర్గమ. 19:3-5). అయితే వారు ఆ నిబంధనను భంగం చేసికొన్నారు (యిర్మీయా 31:32; హెబ్రీ. 8:8-9).


గనుక జరుగవలసిన ఏర్పాటును బట్టి, దేవుడు క్రీస్తునందు మానవాళితో రెండవ నిబంధన చేశాడు. ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనయే దేవుని కడవరి ఏర్పాటు (హెబ్రీ. 1:1-2; 1 పేతురు 1:20; మత్తయి 21:27).


"నిబంధన" అంటే ఒప్పందం కదూ! దేవునికి మానవాళికి జరిగే చివరి ఒప్పందం క్రీస్తు రక్తంవల్ల ఏర్పడింది (లూకా 22:20), సామాన్యంగా రాజు తన మాట యిస్తేనే చాలు. దాన్ని అమల్లో పెట్టడానికి అవసరమైతే తన అధికారమంతటిని వినియోగిస్తాడు. ఒకవేళ అలాటి రాజు తన రక్తంతోనే ఒక ఒప్పందానికి సంతకం చేస్తేనో?! అది ఎంతో శ్రద్ధగా అమల్లో ఉంటుంది. ఒక రాజు తన రక్తంతో సంతకం చేసిన ఒప్పందం ఎలాటిదో క్రొత్త నిబంధన కూడా అలాటిదే (హెబ్రీ. 7:15-16). నీవేమనుకున్నాసరే! క్రీస్తుయేసు మాత్రం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్న మాట వాస్తవం (ప్రకటన 19:16). ఆయన రక్తం క్రొత్త నిబంధనను ముద్రించియుండగా, దైవ మానవుల సంబంధ బాంధవ్యాలు కేవలం ఆ నిబంధన మీదనే ఆధారపడి ఉంటాయ్ (యోహాను 12:48-50). 


పాపక్షమాపణ (ఎఫెసీ. 1:7; అపొ. 2:37-38);

పరిశుద్ధాత్మ అను వరం (ఎఫెసీ. 1:13-14),

ప్రార్థనలకు ప్రతిఫలం (గలతీ. 4:4-6; యోహాను 15:7); 

పరలోక పౌరత్వం (ఫిలిప్పీ. 3:20); 

దైవ సహవాసం (1 కొరింథీ. 1:9; 1 యోహాను 1:3);

నిత్య జీవార్ధమైన నిరీక్షణ;

నిత్య స్వాస్థ్యం మొదలైన దీవెనలన్నిటిని అనుభవించడానికి నేటి మానవుడు సయితం ఆ క్రొత్త నిబంధనకే తిరిగి రావాలి! ఇది పరలోక రాజ్యపు రాజ్యాంగ చట్టం. క్రీస్తు యేసే ఈ రాజ్యానికి రాజు. క్రొత్త నిబంధన క్రిందనున్నవారే ఆయన ప్రజలు; పరలోకం వారి దేశం; భూమిమీద వారు యాత్రికులు - పరదేశులు (1 పేతురు 2:9-11). వారు భూమిమీద జీవించే దినాల్లో తమ ప్రభువును బట్టి భౌతిక అధికారాలకు లోబడి ఉంటారు (రోమా 13:1-6). 


అలాటప్పడు బైబిల్లో ఉన్న పాత నిబంధన ఎందుకు? దానివలన ప్రయోజనమేమి? అని అడుగుతావేమో! పాత నిబంధన లేఖనాలు దైవావేశంవలన కలిగినవే (2 పేతురు 1:20-21; 2 తిమోతి 3:16) అవి “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్ప దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నవి." పైగా క్రీస్తు ప్రభువు ఎవరో (యోహాను 1:45; లూకా 24:44-46); క్రొత్త నిబంధన ఎందుకు ఎలా వచ్చిందో తెలిసికోడానికి అవి సహాయపడతాయి (యిర్మీయా 31:31-84) అంతేకాదు, దేవుని మాటలపై ఎలా నిరీక్షణ కోల్పోకుండా ఉండాలో కూడా అవి సూచిస్తాయ్ (రోమా 15:4). దైవ రాజ్యంగా ఉండకుండ పడిపోయిన ఇశ్రాయేలీయుల్లా మనం ఉండకూడదని మనకు బుద్ది కలగడానికి అవి ఉన్నాయ్. అంటే, వారిలాగా మనం చెడ్డవాటిని ఆశింపకూడదని; విగ్రహారాధకులమై ఉండ కూడదని; ప్రభువును శోధింప కూడదని; సణగ కూడదని వారికి దృష్టాంతములుగా సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడ్డాయ్ (1 కొరింథీ. 10:5).


అంతేగాని ఒకేసారి ఆ రెండు నిబంధనల క్రింద కట్టుబడి ఉండడానికి బైబిలు యివ్వబడలేదు. “కాబట్టి మనము విశ్వాసమూలముననీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్రము (పాత నిబంధన) మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడియా యెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద (పాత నిబంధన క్రింద) ఉండము' (గలతీ. 3:24-25; 5:1-2). ఈ వాస్తవం తెలియనందున కూడా అనేకులు బైబిలును అపార్థం చేసికొనడం జరిగింది.


ఏదియెలాగున్నా దేవుని వద్ద ఆత్మసంబంధమైన ఏ దీవెన పొందాలన్నా ప్రతివాడు ఈ క్రొత్త నిబంధన క్రిందికే రావాలి, ఎవరు ఎలా తలంచినా, దానికి బయట దైవ మానవ నివాస సంబంధాలు నిజంగానే లేవు. *ఈలాటి బైబిలు కేవలం మత గ్రంధము అవుతుందా?* 


సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి..!!!

ఫిలిప్పీ పత్రిక background

*ఫిలిప్పు పత్రిక Back ground*

చెర పత్రికలు 4 

1. ఫిలిప్పి
2. ఎఫెసు
3. కొలస్సీ
4. ఫిలేమోను

అపోస్తలుడైన పౌలు రోమా చెరలో ఉండి రాసిన పత్రికలు ఈ 4.

 అపోస్తులుడైన పౌలు రోమా లో చెరపట్టబడి, చెరసాలలో ఉంచడానికి అతను ఏ నేరము చేసిన వాడు కాడు.
యూదులకు పౌలు చేసిన బోధ నచ్చలేదు.
ధర్మశాస్త్రానికి అతీతమైన అనాది దేవుని నిత్య సంకల్పము నకు సంబంధించిన భోధను వారు అంగీకరించలేదు.

కనుక సహస్రాధిపతి పౌలును బంధించెను. అతనిని చంపాలని కొందరు ప్రయత్నిస్తుంటే.. అతనిని దాచిపెట్టెను.

పౌలు పుట్టుకతో రోమీయుడు. అతని ప్రాణం కాపాడడం సహస్రాధిపతి యొక్క బాధ్యత.
 సహస్రాధిపతి రోమా పౌరసత్వం కొన్నవాడు. పౌలు పుట్టుకతోనే రోమీయుడు.

 కైసరు లో గవర్నర్ ఉంటాడు. సహస్రాధిపతి పౌలును అక్కడికి తరలించి, గవర్నర్ చేతికి అప్పగించాడు. గవర్నర్ ఫేలిక్సు - కొత్త గవర్నర్ ఫేస్తుకు అప్పగించాడు. కొత్త గవర్నర్ ను చూడటానికి అక్కడకు అగ్రిప్ప రాజు వస్తాడు.

 రోమ పౌరులకి కైసరు దగ్గర విచారించబడే అవకాశం ఉంది. కైసరు వద్ద అంటే సుప్రీం కోర్ట్ తో సమానం
 
*ఫిలిప్పు 4: 21-22*
కైసరు ఇంటిలోనివారు పరిశుద్ధులు అయ్యారు. కైసరు ఇంటిలోనికి సువార్త దూరడమా..? ఎలా ?

 నీరో చక్రవర్తి పౌలును హౌస్ అరెస్ట్ చేసి తన బాడీగార్డులను పౌలుకు కాపలాగా ఉంచెను. సైనికులు పౌలును సంకెళ్ళతో బంధించెను.
*పౌలు బంధింపబడెను. సువార్తకూడా బంధింపబడియుండెనని అందరూ తలంచారు.*

 కానీ నీరో తన బాడీగార్డులైన సైనికులను పౌలు వద్ద కాపలాకు పంపించేవాడు. వారు అతనివద్ద గడిపిన సమయములో పౌలు దేవుని రాజ్యమునకు సంబంధించిన విషయాలు వారికి చెప్తుండేవాడు. ఆలాగున సువార్త కైసరు ఇంటిలోనికి వెళ్ళి, అక్కడ సంఘంఏర్పడీంది.

*ఫిలిప్పులో సంఘం ఎలా ప్రారంభమైంది.,?*

ఫిలిప్పులో యూదులు ఉండరు. అది రోమా సైన్యానికి కేంద్రస్ధానం వంటిది, 
స్త్రీలలో కొందరు నదిఒడ్డున కూడుకునేవారు. 
అక్కడికి పౌలు, శీల వెళ్ళి భొధించేవారు. 
లూదియ అను (తుయతైర పట్టణస్దురాలు) ఫిలిప్పు పట్టణంలో వ్యాపారానికి వచ్చినది, ఆమె హృదయం తెరువబడి, ఆమె యేసును అంగీకరించినది. ఆమె ఇంటివారు రక్షణలో ప్రవేశించారు
రెండవ కుటుంబము చెరశాల నాయకుడు కుటుంబము.

అలా అభివృద్ది చెంది, సంఘంలో పెద్దలు ఏర్పడే స్ధాయికి ఎదిగీన సంఘం ఫిలిప్పు సంఘం. 
అక్కడ అధ్యక్షులు, పరిచారకులు, పరిశుద్దులు, ఏర్పడ్డారు. ఆత్మీయంగా అత్యంత అభివృద్ది చెందిన సంఘం ఇది. లోపం లేని సంఘం ఇది.

పౌలు రోమా చెరలో బంధింపబడి ఉన్నాడని ఫిలిప్పుసంఘం తెలుసుకుని, పౌలును చూడటానికి ఎఫప్రొదితుకు కొన్ని ప్రేమపూర్వకమైన కానుకలు ఇచ్చి సంఘం ఇచ్చి పంపిస్తుంది.

ఎఫప్రొదితు తో పౌలు - నేను ఏకొదువ లేకుండా ఉన్నానని చెప్పి, *పౌలు బంధింపబడినా సువార్త బంధింపబడలేదు. అనే విషయం వివరిస్తూ వ్రాసిన పత్రికే ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక.,*

ఫిలిప్పు సంఘం Advanced గా బలపడిన, స్దిరపడిన సంఘం, లోపం లేని సంఘం.


ఎఫెసీ పత్రిక background

*ఎఫెసి పత్రిక - BACK GROUND*

 పౌలు ఆసియాలో కాలు పెట్టాడు అంటే.. ఎఫెసులో కాలు పెట్టాడు అని అర్థం

 అపోస్తులులు 16 : 6 ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్దాత్మ వారిని ఆటంకపరచు నందున...
 ఇక్కడ ఆసియా అంటే ఆసియా ఖండము కాదు రోమ్ యొక్క ఆసియా.. రోమ్ సామ్రాజ్యంలో ఆసియా ఒక రాష్ట్రం

 అపోస్తలులు 20 :18 నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడచుకొంటినో మీరే ఎరుగుదురు 

పౌలు ఆసియాలో వాక్యము చెప్పకమునుపు మాసిధోనియాలో సువార్త ప్రకటించాడు
మాసిదోనియా లో మూడు పట్టణాలు ఉన్నాయి 
1. ఫిలిప్పి (ఇది మాసిదోనియా కేంద్రం)
2. థెస్సలోనికయ
3. బెరయ
  ఈ మూడింటిని పౌలు యొక్క ఆసియా అని కూడా అంటారు 

పౌలు యొక్క ఆసియా అనగా దీనిలో 3 పట్టణాలు ఉన్నాయి
1. ఎఫెసి
2. కొలస్సి
3. లవొదెకియా
ఈ మూడింటిని పౌలు యొక్క ఆసియా అంటారు

 పౌలు ఆసియాలో కాలు పెట్టాడు అంటే ఎఫెసులో కాలు పెట్టాడు అని అర్థం ఆసియాలో సువార్తకు ఎఫెసి కేంద్రం గా ఎంచుకొన్నాడు.
ఎఫెసులో మూడు సంవత్సరాలు నివాసం చేసాడు 
పౌలు దీర్ఘకాలం ఎక్కడా లేడు

 పౌలు ఎఫెసు నాకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే ఎఫెసి విగ్రహారాధనకు కేంద్రముగా ఉండేది 
అక్కడి ప్రజలు ఆర్తిమీదేవి అనే దేవతను కొలిచేవారు
ఆసియా అంతటి నుండి ముఖ్యంగా ఎఫెసినుండి అత్యధికముగా యాత్రికులు వచ్చేవారు 
అర్తెమీదేవి బొమ్మలు అత్యధిక సంఖ్యలో క్రయ విక్రయాలు జరిగేది.
 ఈ బొమ్మల తయారీ, అమ్మకం అత్యధికంగా ఉండడంవల్ల ఆ వ్యాపారం వృద్ధి పొందింది అపోస్తులుడైన పౌలు ఎఫెసు రాకముందు పరిస్థితి ఇది 

అపోస్తలుడైన పౌలు వచ్చిన తరువాత యాత్రికుల రాక తగ్గినది బొమ్మల కొనుగోలు తగ్గిపోయింది 
దానిని నిర్వహించిన వారు ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది.
 పౌలు మాటలు కారణంగా, బోధలకారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నదని వారు భావించడం వల్ల అక్కడ అల్లర్లు జరిగాయి.
పౌలును చంపాలనే ఆలోచనతో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దేవుని కృప, కనికరము పౌలును కాపాడింది.

చెర పత్రికలు

*చెర పత్రికలు - 4*

1. ఫిలిప్పి
2. ఎఫెసి
3. కొలస్సి
4. ఫిలేమోను

అపోస్తులుడైన పౌలు పౌలు రోములో గృహ నిర్బంధంలో ఉన్నాడు. అతని దగ్గరకు రోమా సైనికులు (soldiers) డ్యూటీ ప్రకారం వచ్చి, అతని దగ్గర ఉంటారు 
ఆ సమయంలో పౌలు
ఫిలిప్పి  
ఎఫెసి,
 కొలస్సి,
 ఫిలేమోను
 అను పత్రికలు వ్రాసాడు
 ఈ 4 పత్రికలు joint ventures గా మనకు కనిపిస్తాయి..

*ఫిలేమోను* ఇంటిలో కొలస్సీ సంఘం కూడుకొంటుంది.
ఫిలేమోను ఇంటిలో *ఒనేసీము* అనే బానిస ఉండేవాడు.
తను రోమ్ కు వెళ్లి తనను తాను స్వాతంత్రం ప్రకటించుకుని రోమ్ లో తిరుగుతున్న కాలంలో జైలులో పౌలును కలుసుకుంటాడు 

ఒనేసీము జైలులో బందీగా ఉన్నప్పుడు క్రీస్తు లోనికి కన్వర్ట్ అయ్యాడు.
ఒనేసిమును క్రీస్తు లోనికి కన్వర్ట్ చేసి, తన దగ్గర ఉంచుకోవడం న్యాయం కాదని భావించిన పౌలు అతనిని యజమాని దగ్గరకు పంపడమే భావ్యమని,
ఆసియాలో ఉన్న *తుకికు* అనే సహోదరుని ద్వారా ఒనేసిమును కొలస్సీ సంఘము లో ఉన్న ఫిలేమోను వద్దకు పంపడానికి ఉద్దేశిస్తూ అక్కడి స్థానిక సంఘమునకు ఒక పత్రిక వ్రాసి, 

అదే సమయములో ఫిలేమోనుకు పర్సనల్ గా మరో లెటరు వ్రాసి, పంపిస్తాడు
అదే ఫిలేమోను కు వ్రాసిన పత్రిక

ఒనేసీము ఒక్కడినే పంపిస్తే ఫిలేమోను దగ్గరకు వెళతాడు లేదో అనే సమస్య ఒక ప్రక్క,, ఫిలేమోను ఒనేసిము చేర్చుకుంటాడు లేదో నని మరో ప్రక్క, ఫిలేమోను అంగీకరిస్తాడో లేదో అని తుకికు ద్వారా ఒనేసిమును అప్పగించి అతనిని చేర్చుకునే టట్లుగా ఫిలేమోనుకు ఒక లెటరు వ్రాస్తాడు.

కొలస్సి సంఘమును ప్రారంభించినవాడు *ఎఫఫ్రా*

రోమ్ లో ఎఫఫ్రా జైలులో పౌలు దగ్గర ఉన్నాడు. 
కొలస్సి సంఘంలో సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంలో వ్రాసిన ఉత్తరం కొలస్సి పత్రిక 

కొలస్సి వెళ్ళాలి అంటే 
ఎఫెసు మీదుగా వెళ్ళాలి అందువల్ల ఎఫెసియులను జ్ఞాపకం చేసుకొని, ఆ సంఘ పెద్దలు తనపై చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని, ఇక మీరు నా ముఖము చూడరు అనే మాట, వారి ఏడ్పును జ్ఞాపకము చేసుకొని, ఎఫెసీయులకు మరొక పత్రిక వ్రాయడం జరిగింది 

ఈ మూడు లెటర్లు తుకికు ద్వారా ఎఫెసీయులకు, కొలస్సియులకు, ఫిలేమోనుకు ఈ మూడు పత్రికలు వ్రాసి, ఒనేసీమును ఇచ్చి పంపడం జరిగింది...

పై విషయాలన్నీ ఈ క్రింది వచనాలలో మనము చూడగలము..

కొలస్సి 4:7-9; 
ఫిలేమోనుకు 1:8-12
కొలస్సి 1:7
ఫిలేమోను 1:1-3
ఎఫెసి 6:21


పౌలు ఎఫెసు పరిచర్య ఫలితాలు


*పౌలు ఎఫెసు పరిచర్య ఫలితాలు*

*పౌలు ఎఫెసులో మూడు సంవత్సరములు సువార్త ప్రకటించడం వలన వచ్చిన ఫలితాలు*

*1. మొదటి రిజల్ట్*
అపో. 19:23-40
 అర్తెమీదేవి బొమ్మల వ్యాపారం తగ్గిపోయింది. *విగ్రహారాధన తగ్గీనది*

*2. రెండవ రిజల్ట్*
అపో. 19:18-20
*మాంత్రిక విద్యను* అభ్యసించిన అనేకమంది ఆవిద్యను అభ్యసించడం *మానుకున్నారు*. తమ మంత్రవిద్యకు సంబంధించిన పుస్తకాలు తెచ్చి, అందరిఎదుట వాటిని కాల్చివేసి, తగులబెట్టారు. వాటివిలువ 50,000 వెండిరూకలు.

*3. మూడవ రిజల్ట్*
అపో. 19:11-17
రోగులు స్వస్దతపొందిరి, దయ్యములు పట్టినవారు స్వస్ధతపడిరి.. *యేసునామము ఘనపరచబడెను*

*4. నాలుగవ రిజల్ట్*
అపో 19:8-10
పౌలు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచుండెను. *ఆసియాలో కాపురమున్నవారందరూ ప్రభువువాక్యము వినిరి.*

*5. ఐదవ రిజల్ట్*
అపో.19:1-5
యోహాను బాప్తీస్మం సరికాదని ప్రజలు తెలుసుకుని, యేసునందు విశ్వాసముంచి, మారుమనస్సువిషయమైన బాప్తీస్మము తీసుకోవలెనని చెప్పెను. వారు *యేసు నామమున బాప్తీస్మం పొందిరి.*

మనము అనేక సంవత్సరాలనుండి ఒకే ప్రదేశంలో సువార్త పరిచర్యను కొనసాగిస్తున్నాము. ఎలాంటి ఫలితాలు ఎలా వస్తున్నాయి..? 
మన చుట్టుప్రక్కల వారిపై మన ప్రభావం ఏలా పనిచేస్తుంది..?
మన రిజల్ట్ ఎలా ఉంది ? మనము పరిశీలించుకోవాలి

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...