Tuesday, 7 July 2020

అన్యదేవతలు

*అన్య దేవతలు మరియు విగ్రహారాధనలు* 
➿➿➿➿➿➿➿➿
🎤 ప్రియ సోదరులకు గమనిక.ఇశ్రాయేలు జనులు అన్య దేవతలను పూజించి తప్పిపోయిరి.అన్య దేవతల పేర్లు తెలుసుకోవడం ద్వారా మన ప్రసంగంలో *పుట్ నోట్* కు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను.
🍒 *అషేరాదేవి*(Asherah or Ashatorath) 1రాజు:18:17: అషేరాదేవి సముద్ర స్త్రీ గా పరిగణించబడెను.గిద్యోను తండ్రియైన యేవాషు ఈ దేవతను ఆరాధించుచుండెను.గిద్యోను అషేరాదేవి దేవత స్తంభమును నాశనము చేసెను.న్యాయాధి:6:24-32:
🍒 *అష్తారోతు* (Ashtorath) కనానీయుల దేవతయు బయలు యొక్క సహవాసి ఈ అష్తారోతు దేవతను ఇశ్రాయేలీయులు ఆరాధించుచుండగా సమూయేలు వారిని యెహోవా దేవుని వైపు మళ్ళించెను.1సమూ:7:3,4:
🍒 *బయలు దేవత* కనానీయుల ప్రధాన దేవతయైన ఈ బయలు దేవతకు ఏలియా కర్మేలు పర్వతము దగ్గర వీరి ప్రవక్తలందరిని వధించెను.యెహూ బయలు దేవతలను ఇశ్రాయేలీయుల మధ్యను లేకుండా పూర్తిగా నాశనము చేసెను.1రాజులు: 18:17-40;2రాజు:10:28:
🍒 *బయల్జెబూలు* (దయ్యములరాజు) యేసు దయ్యము పట్టిన గ్రుడ్డివాడిని, మూగవాడిని బాగు చేయగా అది చూసిన పరిసయ్యులు  దయ్యములకు అధిపతియైన బయల్జెబూలు అని యేసు క్రీస్తును నిందించిరి.మత్త:10:25;12:24:
🍒 *దాగోను దేవుడు* ఫిలిష్తీయుల ముఖ్యమైన వ్యవసాయ దేవుడు. దాగోను గుడిలో దేవుని మందసము ఉంచగా, దేవుని మందసము విగ్రహమును నాశనము చేసెను. 1సమూ:5:1-7: సంసోను ఈ గుడిని పడగొట్టెను.న్యాయాధి: 16:23-30:
🍒 *అర్తెమిదేవి* (డయానా) అనేక రొమ్ములతో వికృతమైన ఆకారము కలిగి భూలోకమంతయు పూజింపబడుచున్న ఈ దేవతవిషయమై అపోస్తులుడైన పౌలు ఎఫెస్సీ పట్టణములో ప్రసంగించెను. అపో:కా:19:27-35:
🍒 *ద్యుపతి* (బృహస్పతి) లుస్త్రలోని ప్రజలు అపోస్తులుడైన పౌలు ఒక కుంటి వానిని స్వస్థపరచుటచూచి, పౌలుతోకూడ ఉన్న బర్నబాకు రోమీయులైన ద్యుపతి దేవత పేరు పెట్టిరి:అపో:కా:14:12,13:
🍒 *హెర్మే* ద్యుపతి కుమారుడైన హెర్మే పేరును లుస్త్రలో ముఖ్య ప్రసంగియైన పౌలుకు ఆ పట్టణ ప్రజలు పెట్టిరి.అపో:కా:14:12,13:
🍒 *మెరోదకు* బబులోనీయులకు ప్రధాన దేవుడు మరియు నెబుకద్నేజరుకు ఇష్టుడైన దేవుడు.యిర్మియా:50:2:
🍒 *మొలెకు దేవత* పరిశుద్ధ లేఖనములలో ప్రస్తావించబడిన అన్య దేవతలందరిలో హేయమైన, అమ్మోనీయుల దేవత. ఈ దేవతకు సొలోమోను యెరూషలేములో కొండమీద బలిపీఠము కట్టించెను.రాజు:11:7: మనిష్షే దేవుని నుండి వెడలిపోయి ఈ దేవతా విగ్రహాలకు తన కుమారులను బలియిచ్చెను.2దిన:వృ:28:1-4;33:6:
🍒 *నన్న దేవుడు* ఊరు పట్టణము యొక్క చంద్రదేవుడు. అబ్రహామును  దేవుడు పిలువకమునుపు వారి పితరులు ఆరాధించారు. యెహోషు:24:2:
🍒 *నెబో* బబులోనీయుల దేవుడు.యేష:46:1:
🍒 *నిస్రోకు* అష్షూరు రాజైన సన్హెరీబు ఆరాధించు దేవత. 2రాజు:19:37:
🍒 *రిమ్మోను* సిరియనుముల సైన్యాధిపతియు కుష్టు రోగియైన నయమాను స్వస్థతపొందకమునుపు ఆరాధించిన దేవుడు. 2రాజు:5:15-18:
🍒 *తమ్మూజు దేవత* గర్భో త్పత్తి కలిగించు దేవత.యెహెజ్కే:8:14:
🍒 పేర్లులేని దేవతా విగ్రహములు.
📍రాహేలు తండ్రి ఇంట దొంగిలించిన గృహదేవతలు.ఆది:కా:31:19:
📍సినాయి కొండ వద్ద ఇశ్రాయేలీయులు తయారుచేసిన బంగారు దూడ. నిర్గమ:కా: 32!!అ!!
📍 యెరోబాము రెండు బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలు నందు రెండవది దాను నందు ఉంచెను.1రాజు:12:28-31:
📍 నెబుకద్నేజరు దూరాయను మైదానములో నిలువబెట్టించిన బంగారు ప్రతిమ.
📍 పౌలు ఏథెన్స్ లో చూసిన పేరు తెలియని దేవతా విగ్రహము.అపో: కా:17!!అ!!
📍 కౄరమృగము
 యొక్క ప్రతిమ.ప్రకట:13:14:
     

అద్బుతములు మరియు స్వస్థతలు

*అద్భుతములు మరియు స్వస్థతలు.*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎤ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, 
 దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను. 
హెబ్రీ:2:2-4:
📍 పరిశుద్ధాత్మ యొక్క పనిలో అద్భుతములు ఒక ప్రాముఖ్యమైయున్నవి.
📍 తండ్రియైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించువాడు.
📍 ఆత్మ యొక్క శక్తి ద్వారా తన వాక్యాన్ని తెలియపరచి,స్థిరపరచి,భద్రపరిచాడు.
🔥 *అద్భుతములకు ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది.* 
🍇 సృష్టిని చేయటం ద్వారా దేవుని ఉనికిని ఋజువుచేయడం జరిగింది. రోమా:1:20:
🍇 అద్భుతముల ద్వారా యెహోవాయే నిజమైన దేవుడని కనుపరుచుకున్నాడు.
🍇 ఐగుప్తు దేవతలకంటే గొప్పవాడనియు..నిర్గమ:కా:10:1,2;18:11:
🍇 ఏలియా ద్వారా కనానీయుల దేవతలకంటే మించిన వాడని ప్రదర్శించుకున్నాడు. 1వ రాజు18:37-39:
🍇 సూచకక్రియలు, అద్భుతములు, మహత్కార్యముల ద్వారా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించుకున్నాడు. యోహాను:20:30-31; అపో:కా:2:22:
🍇 అద్భుతములు, మహత్కార్యములు జరిగించుటచే అపోస్తుల ద్వారా దేవుని శక్తిని పరిశుద్ధాత్మ కనుపరిచెను.
🍇 దేవుని పక్షముగా మాట్లాడేవారికి అద్భుత రీతిగా వాక్యాన్ని ఇవ్వడము మాత్రమే కాకుండా, అద్భుతములు ద్వారా స్థిరపరచబడింది.మార్కు:16:20;అపో:కా:14:3;హెబ్రీ:2:4:
🔥 *అబద్ధ ప్రవక్తలు + అబద్ధబోధకులు.*
🍇 నిజమైన ప్రవక్తలా? ఉపదేశకులా? అద్భుతముచేయు చేయువారా? అని పరీక్షింపవలసియున్నది. ద్వితీ:కా:13:1-5:
🍇 మోషే చేసిన సూచ క్రియలకు బదులుగా తాము మంత్రములద్వారా చేయగలమని శకునగాండ్రు ఫరోని తప్పుదోవ పట్టించారు. నిర్గమ:కా:7:11:
🍇 క్రీస్తు యొక్క అపోస్తులుల వేషం అబద్ద బోధకులు ధరించుకొనియున్నారు.
 ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు.
 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు 
 గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. 
2వ కొరింధీ:11:13-15:
🍇 దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను.అపో:కా:19:12:
🍇 అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. 
 యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.
అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.అపో:కా:19:13-16:
🍇 నేడు అబద్ధబోధకులు అద్భుతములు చేస్తామని ప్రజలను మోసంచేస్తూ ధనము సంపాదించుకుంటున్నారు.
🔥 *అద్భుతములు దైవికమైనవి* 
🍇 ఒకని విశ్వాస బలము మీదనే కాకుండా దేవునిశక్తి ద్వారా అద్భుతములు జరిగినాయి.
🍇 తాను అభిషేకించిన అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిచేత అద్భుతములు జరిగినాయి.
🍇 అపోస్తులులు చేతులుంచువరకు ఇతరులు అద్భుతములు చేయకుండిరి.అపో:కా:6:5-6;8:6:
🍇 పరిశుద్ధాత్మవరము  చేతులుంచుటవలన ప్రసాదించగల అధికారము పరిశుద్ధాత్మచేత అపోస్తలులకు ఇవ్వబడినది.
Eg:-తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును, ప్రవచించుటకును మొదలుపెట్టిరి. 
అపో:కా:19:6;ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 
2వ తిమోతి:1:6:
🍇 అపోస్తులుల ద్వారా శక్తిపొందినవారు తిరిగి తమ చేతులు ఇతరుల మీద ఉంచుట ద్వారా అద్భుతవరములు ప్రసాదించినట్లు మనకు ఎలాంటి రుజువులు లేవు. 
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. 
అప్పుడు సీమోనుకూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను.అపో:కా:8:12,13:
🍇అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. 
అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోనుచూచి 
వారియెదుట ద్రవ్యముపెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. 
అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.అపో:కా:8:17-20:
🍇మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది. 
2వ కోరింథీ:1:7:
🍇 అపోస్తులుల దినాలు గడిచిపోయినవి.సూచక క్రియలు,అద్భుతములు, మహత్కార్యములు, నిలిచిపోయినవి. అలాంటి వరములు అనుగ్రహించుటకు అపోస్తులులులేరు.
🔥 *అద్భుతములు స్వస్థతలు అందరినీ బాగుచేసేవికావు* 
🍇 క్రీస్తు-రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు.
 మత్తయి:9:12;లూకా:5:31:
🍇 పౌలు తన జతపనివానిని(తిమోతి, త్రోఫిము) బాగుచేయలేదనేది వాస్తవం.ఔషధం ఉపయోగించమన్నాడు.
🍇ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 
1వ తిమోతి:5:23: _ద్రాక్షారసము కేవలము ఔషధము కొరకే పౌలు వాడమన్నాడు._ 
స్వస్థత అనేది కేవలం రోగులను బాగు చేయుట.వరం పొందిన వారికి వర్తిస్తుంది.
🍇ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను. త్రోఫిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని. 
2వ తిమోతిక:4:20: పౌలు త్రోఫీమును,తిమోతినీ స్వస్థపరచలేదు.కారణం పౌలు విశ్వాసములో, ప్రార్థనలో శక్తిలేదా? లేక వారిలో విశ్వాసము లేదా?
🍇 అద్భుతాలు,స్వస్థతలు విశ్వాసులకు ఉద్దేసింపబడలేదని చదువరులు గ్రంథ ప్రకారం వాస్తవం గుర్తించాలి.
🍇 నేడు అద్భుతములు స్వస్థతలు బూటకమే. వారు స్థాపించిన సంఘముల విస్తరణ కొరకు ఆర్థికవృద్ధి కొరకు మాత్రమే.
🍇 ఎప్పుడైనా ఊచచేతులు గలవారిని, అవిటివారిని, మూగవారిని, గ్రుడ్డి వారిని బాగుచేసినట్లు మీరు ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా? మోసపోకుడి మీరు దేవునికి ప్రార్ధనలు, విజ్ఞాపనలు తెలియజేయుడి. దేవుడు వింటాడు. యాకోబు:5:12-18:
 🔅*కరోనా* సమయంలో వీరందరూ ఏమైపోయారో? ఆలోచించండి.
(ఇంకా ఉంది....!)

కృపావరములు

*పరిశుద్ధాత్మ-కృపావరములు.*
➖➖➖➖➖➖➖➖
🎤మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 
1వ కోరింథీ:12:28:
📍 పరిశుద్ధాత్మచే అనుగ్రహింపబడిన వరములను పరిశుద్ధాత్మ వరముతో తికమక చేయకూడదు.
📍 పరిశుద్ధాత్మవరము  *Dorea* అనే గ్రీకు పదమునుండి  తర్జుమా చేయబడినది.
📍దేవుని కుమారులకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ అనేవరము అంతరంగమందు నివసించు ఆత్మ .1వకొరింధీ :6:19:
📍 మనలో నివసించు ఆత్మ వలన. 2వ తిమోతి:1:14:
📍 మీలో నివసించు ఆత్మ.రోమా:8:9:
📍 పరిశుద్ధాత్మచే అనుగ్రహింపబడే వరములు *Chrisma* అనే గ్రీకు పదము నుండి తర్జుమా చేయబడినది.
📍 దైవికముగా అనుగ్రహింపబడే మానవాతీత శక్తులు. రోమా:12:6,7:
📍 *Chrisma* కృపా వరములు అనికూడా తర్జుమా చేయవచ్చు. రోమా:5:15;1వ పేతురు:4:10,11:
 *గమనిక:-* ఆత్మచే అద్భుతములు చేయ శక్తి పొందువరము కాదు. అంతరంగములో నివసించు ఆత్మ అను వరము.
📍 క్రైస్తవ జీవితం జీవించేలా క్రైస్తవుని బలపరుస్తుంది.
 మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను.ఎఫెస్సీ:3:15:
1️⃣ *నానా విధములైన వరములు* 
🔥 కృపావరములు నానా విధములుగా ఉన్నవిగాని ఆత్మ ఒక్కడే.1వ కోరింది:12:4:
🔥వివిధములైన కృపావరములు ఉన్నాయంటే, కోరింథీయులకు వివిధములైన ఆత్మలు ఉన్నాయని పౌలు యొక్క ఉద్దేశం కాదు.
🔥 పరిశుద్ధాత్మ కృపావరములు *9.* (1)బుద్ధి వాక్యము,(1వ కొరింధీ:12:8)(2)జ్ఞాన వాక్యము.(12:8)(3)విశ్వాసము.(12:9) (4) స్వస్థపరచు వరము.(12:9) (5)అద్భుత కార్యములుచేయు శక్తియు.(12:10)(6) ప్రవచన వరము(12:10)(7)ఆత్మల వివేచనము (12:10)(8)నానావిధ భాషలను.(12:10) (9)భాషల అర్థం చెప్పు శక్తియు.(12:10)
🔥 కొరింధీలో ఉన్న ఏ ఒక్క క్రైస్తవునికి ఈవరములన్నియు లేవు. ఆత్మ యొక్క ఇష్టానుసారముగా ఇవ్వబడ్డాయి.
🔥అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 
1వ కోరింథీ:12:11:
🔥 తన సొంతదైన యోగ్యతవల్లనో లేక సామర్ధ్యం వలననో ఆయా కృపావరములు కలిగియుండలేదని పొందినవారు గ్రహించవలసి యున్నది.
2️⃣  *కృపావరములు ఉద్దేశము* 
🔥 ఆత్మ సంబంధమైన పరిపక్వత పెంచుటకు సహాయపడునట్లు కృపా వరములు ఇవ్వబడ్డాయి.
🔥 కృపావరము- పొందినవాని స్వప్రయోజనము కొరకుగాక సంఘ ప్రయోజనము కొరకు ఉద్దేశించబడ్డాయి.
🔥 కృపావరము యొక్క ఉద్దేశము _క్షేమాభివృద్ధి,హెచ్చరికయు,ఆదరణ_ కలుగునట్లు ప్రవచించువారు మనుషులతో మాట్లాడుచున్నాడు.
🔥మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. 
1వ కోరింథీ:14:12:
3️⃣ *కృపావరములు* 
🔥 _జ్ఞానవాక్యమనే_ కృపావరము.1వ కొరింధీ:12:8:
📍 ఆత్మద్వారా అందించబడిన దైవసందేశము.
📍 మానవ ప్రయాస వాని సామర్ధ్యం కంటే వ్యత్యాసంగా ఉంటుంది.
📍నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
 పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని 
1వ కోరింథీ :2:5,6:
📍ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. 
1వ కోరింథీ:12:13:
🔥 _బుద్ధి వాక్యము._ 1వ కోరింధీ12:8;
📍 దైవికముగా ప్రసాదించబడిన తెలివి లేక బుద్ధి గ్రీకు భాషలో *Gnosis* అనే పదము నుండి తర్జుమా చేయబడినది.
📍 జ్ఞానముతో పాటు ఈ బుద్ధి క్రీస్తునందు గుప్తమైయున్నది. కొలస్సీ :2:3:
📍 మానవ తెలివికి మారుగా బుద్ధివాక్యమనేది దేవునికి సంబంధించిన ప్రత్యక్షతద్వారా బయలుపరచబడుతుంది.రోమా:11:33:
🔥 _ఆత్మచే ఇవ్వబడే విశ్వాసమనే_ కృపావరము.1వ కోరింధీ:12:9:
📍 దేవుని వాక్యము చదువుట ద్వారా కలిగిన విశ్వాసము కాదు.రోమా:10:17:
📍 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వాడైయుండాలి.
📍మీరు ఏ విషయములో ఎదిరించువారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షము పోరాడుచూ ఏకమనస్సుగలవారై ఉండవలెను.ఈ విశ్వాసాన్ని పొందిన వారికి ప్రకృతికి అతీతమైన  శక్తి మనస్సు కలిగి ఉంటుంది.
🔥 _స్వస్థపరచు వరము_ 🔥 _అద్భుతములు చేయు శక్తియు_ ఆత్మవరములైయున్నాయి.దీనికి మరోసారి వివరణ ఇస్తాను.
🔥 _ప్రవచన వరం._ 
📍ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 
 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.
2వ పేతురు:1:20,21:
📍 యొక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినయెడల దేవోక్తులు బోధించునట్లు బోధించవలెను.1వ పేతురు :4:10:
📍క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలనుగాను నియమించెను.ఎఫెస్సీ:4:12:
📍 క్రొత్త నిబంధన ప్రవక్తలు-
 మరియు యూదాయు సీలయుకూడ ప్రవక్తలై యుండినందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి. 
అపో.కా:15:32:
📍 అపోస్తులులు ఏర్పరుచుకున్న ఏడుగురిలో ఒకడు, సువార్తికుడైన పిలుప్పుకు ప్రవక్తలుగా ఉన్న నలుగురు కన్యకలు అతనికుండిరి.వారు ప్రవచించువారు. అపో:కా:21:8,9:
📍ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
 అయితే కూర్చున్న మరియొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. 
 అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 
1వ కోరింథీ:14:29-31:
🔥 _ఆత్మలవివేచన అనే కృపావరము._ 
📍 ఈ కృపావరము గలవారు అబద్ధబోధకు,సత్య బోధకు మధ్య తారతమ్యాన్ని వేరు చేయగలవారై ఉంటారు.
📍ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 
1వ యోహాను:4:1:
📍 ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము. 
1వ యోహాను:4:6:
📍 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 
1వ కోరింథీ :14:29:
🔥 _నానావిధ భాషలు మరియు భాషలకు అర్థం చెప్పుటయు_ చేర్చబడ్డాయి.1వ కొరింధీ:12:10:
📍ఈ కృపావరమును పొందినవారు తాము నేర్చుకొనని భాష మాట్లాడుతారు.
📍 లేదా అంతకు ముందు ఎరుగని భాషకు భావాన్ని చెబుతారు.
📍భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. 
 అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. 
1వ కోరింధీ.14:27,28:
📍 అర్థము చెప్పేవారు ఉంటేనే గాని భాష మాట్లాడుటకు వీలు లేదు.
📍కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచికయై యున్నది.
(ఇంకా ఉన్నది....!)
( *తరువాత అద్భుతములు మరియు భాషలు* )
   

విగ్రహారాధన

*విగ్రహారాధన*

బైబిల్ మొత్తం మీద ముఖ్యంగా పాతనిబంధన లో విగ్రహారాధన చెయ్యొద్దు అని అనేకచోట్ల యెహోవా  గట్టిగా హెచ్చరించాడు.

ఇలా చెప్పటానికి కారణం ఏమిటి ?

ఎందుకు విగ్రహారాధన చెయ్యవద్దని చెప్పాడు ?

విగ్రహారాధన చేస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి ?

హిందూ సోదరులు కూడా విగ్రహారాధన విషయం లో బైబిల్ ను అదేపనిగా విమర్శిస్తూ ఉంటారు.

ఈ విషయాలను బైబిల్ వెలుగులో మరియు చారిత్రక ఆధారాల వెలుగులో క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

బైబిల్ మొత్తం లో విగ్రహాల లో ఉండే దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఒక్కచోట కూడా తమ ఆక్టివిటీ కనపరచలేదు.
అంటే యెహోవా శక్తిని అడ్డుకోవడం కానీ ,    కనీసం మానవుల మీదనైనా  తమ ప్రభావాన్ని చూపడం కానీ జరగలేదు.
కారణం ఏమై ఉంటుంది ?
ఆ విగ్రహాల లో ఏమైనా ఉంటే కదా ప్రభావం చూపటానికి.

విగ్రహాల లో దేవుళ్ళు ,దేవతలు ఎవరూ లేరని ,
యెహోవా నిరూపించిన సందర్భాన్ని బైబిల్ నుండి చూద్దాం.

యెహోవా ఈజిప్ట్ పైకి రప్పించిన తెగుళ్ళు అన్నీ కూడా ఆ దేశంలోని దేవుళ్ళ పైకి రప్పించినవే.

నదులను ,జంతువులను ,చెట్టులను ,చేమలను,
పాములను ఇప్పుడు మన భారతీయులు పూజించినట్లు గా,అప్పుడు ఈజిప్ట్ ప్రజలు కూడ పూజించే వారు ,
ఈజిప్ట్ ప్రజలు ప్రక్రుతిని ,విగ్రహాలను ఆరాదిస్తారు.

ఈజిప్ట్ ప్రజల దేవుళ్ళను వరుసగా ఇప్పుడు చూద్దాం.

1. ఓసిరిస్  :-  నైలునది దేవుడిని వీళ్ళు ఓసిరీస్ అని పిలుస్తారు.
యెహోవా మొట్టమొదటి తెగులును నైలునది దేవుడు మీదనే ఎక్కుపెట్టాడు. నదిలోని నీళ్ళన్నీ 
రక్తం లా మార్చాడు.
నైలునది దేవుడు యెహోవా యొక్క శక్తిని అడ్డుకోలేకపోయాడు (నిర్గమ 7:20).

2.హెక్ట్   :-      ఈజిప్ట్ ప్రజలు కొలిచే హెక్ట్ అనే దేవత కప్ప రూపం లో ఉంటుంది.
దేవుడు ఈజిప్ట్ ను కప్పలతో నింపి ప్రజలు ఆ కప్పలతోటి బాగా ఇబ్బంది పడేలా చేశాడు,
కప్ప దేవత యెహోవా శక్తిని అడ్డుకోలేక 
పోయింది( నిర్గమ 7:20 ).

3. సెబ్   :-      సెబ్ అంటే భూదేవి. వీరు భూమిని దేవత గా పూజిస్తారు ,ఆ దేవత పేరు సెబ్.
మోశే కర్ర తో భూమి మీద ధూళి ని రేపగా ,ఆ ధూళి పేలు రూపంలో  ఈజిప్ట్ దేశం మొత్తం వ్యాపించి  ప్రజలను ,జంతువులను బాగా బాగా ఇబ్బంది పెట్టెను.
భూదేవి కూడా యెహోవా శక్తిని అడ్డుకోలేకపోయింది ( నిర్గమ 8:17 ).

4. హేటకోక్ :-   నైలునది దేవుడి భార్య పేరు హెటకోక్. ఈదేవత కీటకము రూపం లో ఉంటుంది. ఈ దేవతకు వ్యతిరేకంగా యెహోవా          బాధాకరమైన ఈగలగుంపును ఈజిప్ట్ లోకి పంపించాడు ,వీటివల్ల ఈజిప్ట్ దేశం చెడిపోయెను అని ఉంటుంది.
ఈ దేవత కూడ యెహోవా శక్తి ని అడ్డుకోలేక పోయింది ( నిర్గమా 8:24 ).

5. అపిస్ :-   అపిస్ అంటే ఎద్దు రూపం లో ఉండే నంది దేవుడు.
ఈ నంది దేవుడికి వ్యతిరేకం గా యెహోవా ఈజిప్ట్ పశువుల మీదకు తెగులు పంపించాడు.
యెహోవా యొక్క శక్తిని నంది దేవుడు కూడా అడ్డుకోలేకపోయాడు ( నిర్గమ 9:6 ).

6. టైఫోన్  :-    టైఫోన్ అనే దేవతకు వ్యతిరేకం గా యెహోవా  దద్దుర్లు అనే రోగాన్ని ఈజిప్ట్ ప్రజల మీదకు పంపుతాడు.అవి వారిని బహుగా బాధ పెట్టెను.
ఈ దేవత కూడా యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయింది ( నిర్గమ 9:10 ).

7. షు  :-     షు అనేది ఈజిప్ట్ ప్రజలకు వర్షాన్ని ఇచ్చే దేవుడు అని వారి నమ్మకం.
ఈ వరుణ దేవుడికి వ్యతిరేకం గా అగ్నితో కూడిన వడగళ్ళు యెహోవా కురిపించాడు.
వరుణదేవుడు కూడ యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయాడు ( నిర్గమ 9:24 ).

8. సెరాపియ  :-   ఇతను మిడత రూపంలో ఉండే దేవుడు. ఈజిప్ట్ ప్రజల పంటలను మిడతల బారినుండి ఈ దేవుడె కాపాడుతున్నాడు అని వీరి నమ్మకం.
యెహోవా ఈ దేవునికి వ్యతిరేకం గా మిడతల దండు ను పంపాడు అవి ఈజిప్ట్ దేశం లోని నెలంతా కప్పివేసి వారి పంటలను పూర్తిగా తినివేశాయి.
ఈ దేవుడు కూడ యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయాడు ( 10:13 ).

9. రా   :-   వీళ్ళు సూర్యుడిని రా అనే పేరు తో  పిలుస్తారు ,సూర్యుడు కూడా ఈజిప్ట్ ప్రజలకు ముఖ్యమైన దేవుడే.
యెహోవా 3 రోజుల పాటు ఈజిప్ట్ ను దట్టమైన చీకటి తో నింపుతాడు.
కానీ ఇశ్రాయేలీయుల వద్ద వెలుతురు ఉంటుంది.
వీరు దేవుడుగా కొలిచే సూర్యుడు యెహోవా శక్తి ని అడ్డుకోలేక పోయాడు ( నిర్గమ 10:22 ).

10. దేవుళ్ళు అందరూ :-   చివరిగా యెహోవా ఈజిప్ట్ లోని తొలి సంతానం మొత్తాన్ని హతం చేశాడు. ఈజిప్ట్ ప్రజలు దేవుళ్ళు గా భావించే ఏ ఒక్కరూ దీనిని అడ్డుకోలేకపోయారు ( నిర్గమా 12:29 ).

ఈజిప్ట్ ప్రజలు పూజించే విగ్రహాల లో ఉండే దేవుళ్ళు యెహోవా శక్తిని ఎందుకు అడ్డుకోలేకపోయారు ?
ఎందుకంటే విగ్రహాల లో ఏ దేవుడు లేడు ,ఉండడు కాబట్టి ,
విగ్రహాలను ,ప్రక్రుతి ని ఆరాదించటము వ్యర్ధం కనుక యెహోవా విగ్రహారాధన చెయ్యవద్దని ,విగ్రహాలను పడగొట్టమని చెప్పాడు.

నేటి భారతీయ విగ్రహారాధికులకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా  ఏమిటంటే ,

ఇప్పుడు మీరు పూజిస్తున్నట్లే నదులు ,జంతువులు ,చెట్లు ,చేమలను ఆనాడు ఈజిప్ట్ ప్రజలు కూడ పూజించారు.
విగ్రహాలలో దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు మీరు నమ్ముతున్నట్లే ఆనాడు వాళ్ళు కూడా నమ్మారు.
యెహోవా ఈ దేవుళ్ళ మీదనే తెగుళ్ళు పంపినప్పుడు ఈ దేవుళ్ళు  యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయారు ఎందుకని ?
కారణం ఏమిటి ?
సమాధానం చెప్పాలి మీరు.

ఆనాడు ఈజిప్ట్ ప్రజలు పూజించిన విగ్రహాలు వారిని కాపాడలేకపోయాయి.
ఈనాడు మీరు పూజించే విగ్రహాలు కూడా మిమ్మల్ని కాపాడ లేవు,నిత్య జీవానికి నడిపించలేవు.
విగ్రహారాధికులనందరినీ ఈరోజు  ఈ పోస్ట్ ద్వారా యెహోవా హెచ్చరిస్తున్నాడు.
సత్యాన్ని గ్రహించండి.

సృష్టి ని శాసించి, తానే దేవుడిని ,తానే సృష్టికర్త ను అని ప్రపంచానికి నిరూపించాడు యెహోవా.

విగ్రహారాధన చెయ్యవద్దని ,విగ్రహాలను నాశనం చెయ్యండిఅని యెహోవా చెప్పిన  ఈ మాటలన్నీ  అసూయ తోనో ,అహంకారం తోనో చెప్పిన  మాటలు కావు ,
అధికారం తో చెప్పే మాటలు.

అసలు యెహోవా ఇన్ని అద్భుతాలు చేశాడా ? నిజమేనా ?మానవులు ఊహించి వ్రాసుకున్న కట్టుకథ కావచ్చేమో అని కొంతమంది విగ్రహారాధికులకు సందేహం రావచ్చు.
అది కూడా చూద్దాం నిజమా ,కాదా అని.

దీనిని బట్టి బైబిల్ లో వ్రాయబడినవి కట్టుకధలు కాదు అని మనకు నిరూపణ అయ్యింది.
సోదోమ ,గోమోర పట్టణాలు కూడ ఈనాటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ  యెహోవా సర్వ శక్తి కలిగిన దేవుడు అని సాక్ష్యమిస్తున్నాయి.

కనుక విగ్రహారాధికులు అందరూ పక్షపాతాన్ని పక్కన పెట్టి, ఆలొచన చేసి ,సత్యాన్ని గ్రహించాలి అని ప్రేమ పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...