*విగ్రహారాధన*
బైబిల్ మొత్తం మీద ముఖ్యంగా పాతనిబంధన లో విగ్రహారాధన చెయ్యొద్దు అని అనేకచోట్ల యెహోవా గట్టిగా హెచ్చరించాడు.
ఇలా చెప్పటానికి కారణం ఏమిటి ?
ఎందుకు విగ్రహారాధన చెయ్యవద్దని చెప్పాడు ?
విగ్రహారాధన చేస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి ?
హిందూ సోదరులు కూడా విగ్రహారాధన విషయం లో బైబిల్ ను అదేపనిగా విమర్శిస్తూ ఉంటారు.
ఈ విషయాలను బైబిల్ వెలుగులో మరియు చారిత్రక ఆధారాల వెలుగులో క్షుణ్ణంగా పరిశీలిద్దాం.
బైబిల్ మొత్తం లో విగ్రహాల లో ఉండే దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఒక్కచోట కూడా తమ ఆక్టివిటీ కనపరచలేదు.
అంటే యెహోవా శక్తిని అడ్డుకోవడం కానీ , కనీసం మానవుల మీదనైనా తమ ప్రభావాన్ని చూపడం కానీ జరగలేదు.
కారణం ఏమై ఉంటుంది ?
ఆ విగ్రహాల లో ఏమైనా ఉంటే కదా ప్రభావం చూపటానికి.
విగ్రహాల లో దేవుళ్ళు ,దేవతలు ఎవరూ లేరని ,
యెహోవా నిరూపించిన సందర్భాన్ని బైబిల్ నుండి చూద్దాం.
యెహోవా ఈజిప్ట్ పైకి రప్పించిన తెగుళ్ళు అన్నీ కూడా ఆ దేశంలోని దేవుళ్ళ పైకి రప్పించినవే.
నదులను ,జంతువులను ,చెట్టులను ,చేమలను,
పాములను ఇప్పుడు మన భారతీయులు పూజించినట్లు గా,అప్పుడు ఈజిప్ట్ ప్రజలు కూడ పూజించే వారు ,
ఈజిప్ట్ ప్రజలు ప్రక్రుతిని ,విగ్రహాలను ఆరాదిస్తారు.
ఈజిప్ట్ ప్రజల దేవుళ్ళను వరుసగా ఇప్పుడు చూద్దాం.
1. ఓసిరిస్ :- నైలునది దేవుడిని వీళ్ళు ఓసిరీస్ అని పిలుస్తారు.
యెహోవా మొట్టమొదటి తెగులును నైలునది దేవుడు మీదనే ఎక్కుపెట్టాడు. నదిలోని నీళ్ళన్నీ
రక్తం లా మార్చాడు.
నైలునది దేవుడు యెహోవా యొక్క శక్తిని అడ్డుకోలేకపోయాడు (నిర్గమ 7:20).
2.హెక్ట్ :- ఈజిప్ట్ ప్రజలు కొలిచే హెక్ట్ అనే దేవత కప్ప రూపం లో ఉంటుంది.
దేవుడు ఈజిప్ట్ ను కప్పలతో నింపి ప్రజలు ఆ కప్పలతోటి బాగా ఇబ్బంది పడేలా చేశాడు,
కప్ప దేవత యెహోవా శక్తిని అడ్డుకోలేక
పోయింది( నిర్గమ 7:20 ).
3. సెబ్ :- సెబ్ అంటే భూదేవి. వీరు భూమిని దేవత గా పూజిస్తారు ,ఆ దేవత పేరు సెబ్.
మోశే కర్ర తో భూమి మీద ధూళి ని రేపగా ,ఆ ధూళి పేలు రూపంలో ఈజిప్ట్ దేశం మొత్తం వ్యాపించి ప్రజలను ,జంతువులను బాగా బాగా ఇబ్బంది పెట్టెను.
భూదేవి కూడా యెహోవా శక్తిని అడ్డుకోలేకపోయింది ( నిర్గమ 8:17 ).
4. హేటకోక్ :- నైలునది దేవుడి భార్య పేరు హెటకోక్. ఈదేవత కీటకము రూపం లో ఉంటుంది. ఈ దేవతకు వ్యతిరేకంగా యెహోవా బాధాకరమైన ఈగలగుంపును ఈజిప్ట్ లోకి పంపించాడు ,వీటివల్ల ఈజిప్ట్ దేశం చెడిపోయెను అని ఉంటుంది.
ఈ దేవత కూడ యెహోవా శక్తి ని అడ్డుకోలేక పోయింది ( నిర్గమా 8:24 ).
5. అపిస్ :- అపిస్ అంటే ఎద్దు రూపం లో ఉండే నంది దేవుడు.
ఈ నంది దేవుడికి వ్యతిరేకం గా యెహోవా ఈజిప్ట్ పశువుల మీదకు తెగులు పంపించాడు.
యెహోవా యొక్క శక్తిని నంది దేవుడు కూడా అడ్డుకోలేకపోయాడు ( నిర్గమ 9:6 ).
6. టైఫోన్ :- టైఫోన్ అనే దేవతకు వ్యతిరేకం గా యెహోవా దద్దుర్లు అనే రోగాన్ని ఈజిప్ట్ ప్రజల మీదకు పంపుతాడు.అవి వారిని బహుగా బాధ పెట్టెను.
ఈ దేవత కూడా యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయింది ( నిర్గమ 9:10 ).
7. షు :- షు అనేది ఈజిప్ట్ ప్రజలకు వర్షాన్ని ఇచ్చే దేవుడు అని వారి నమ్మకం.
ఈ వరుణ దేవుడికి వ్యతిరేకం గా అగ్నితో కూడిన వడగళ్ళు యెహోవా కురిపించాడు.
వరుణదేవుడు కూడ యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయాడు ( నిర్గమ 9:24 ).
8. సెరాపియ :- ఇతను మిడత రూపంలో ఉండే దేవుడు. ఈజిప్ట్ ప్రజల పంటలను మిడతల బారినుండి ఈ దేవుడె కాపాడుతున్నాడు అని వీరి నమ్మకం.
యెహోవా ఈ దేవునికి వ్యతిరేకం గా మిడతల దండు ను పంపాడు అవి ఈజిప్ట్ దేశం లోని నెలంతా కప్పివేసి వారి పంటలను పూర్తిగా తినివేశాయి.
ఈ దేవుడు కూడ యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయాడు ( 10:13 ).
9. రా :- వీళ్ళు సూర్యుడిని రా అనే పేరు తో పిలుస్తారు ,సూర్యుడు కూడా ఈజిప్ట్ ప్రజలకు ముఖ్యమైన దేవుడే.
యెహోవా 3 రోజుల పాటు ఈజిప్ట్ ను దట్టమైన చీకటి తో నింపుతాడు.
కానీ ఇశ్రాయేలీయుల వద్ద వెలుతురు ఉంటుంది.
వీరు దేవుడుగా కొలిచే సూర్యుడు యెహోవా శక్తి ని అడ్డుకోలేక పోయాడు ( నిర్గమ 10:22 ).
10. దేవుళ్ళు అందరూ :- చివరిగా యెహోవా ఈజిప్ట్ లోని తొలి సంతానం మొత్తాన్ని హతం చేశాడు. ఈజిప్ట్ ప్రజలు దేవుళ్ళు గా భావించే ఏ ఒక్కరూ దీనిని అడ్డుకోలేకపోయారు ( నిర్గమా 12:29 ).
ఈజిప్ట్ ప్రజలు పూజించే విగ్రహాల లో ఉండే దేవుళ్ళు యెహోవా శక్తిని ఎందుకు అడ్డుకోలేకపోయారు ?
ఎందుకంటే విగ్రహాల లో ఏ దేవుడు లేడు ,ఉండడు కాబట్టి ,
విగ్రహాలను ,ప్రక్రుతి ని ఆరాదించటము వ్యర్ధం కనుక యెహోవా విగ్రహారాధన చెయ్యవద్దని ,విగ్రహాలను పడగొట్టమని చెప్పాడు.
నేటి భారతీయ విగ్రహారాధికులకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఏమిటంటే ,
ఇప్పుడు మీరు పూజిస్తున్నట్లే నదులు ,జంతువులు ,చెట్లు ,చేమలను ఆనాడు ఈజిప్ట్ ప్రజలు కూడ పూజించారు.
విగ్రహాలలో దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు మీరు నమ్ముతున్నట్లే ఆనాడు వాళ్ళు కూడా నమ్మారు.
యెహోవా ఈ దేవుళ్ళ మీదనే తెగుళ్ళు పంపినప్పుడు ఈ దేవుళ్ళు యెహోవా శక్తిని అడ్డుకోలేక పోయారు ఎందుకని ?
కారణం ఏమిటి ?
సమాధానం చెప్పాలి మీరు.
ఆనాడు ఈజిప్ట్ ప్రజలు పూజించిన విగ్రహాలు వారిని కాపాడలేకపోయాయి.
ఈనాడు మీరు పూజించే విగ్రహాలు కూడా మిమ్మల్ని కాపాడ లేవు,నిత్య జీవానికి నడిపించలేవు.
విగ్రహారాధికులనందరినీ ఈరోజు ఈ పోస్ట్ ద్వారా యెహోవా హెచ్చరిస్తున్నాడు.
సత్యాన్ని గ్రహించండి.
సృష్టి ని శాసించి, తానే దేవుడిని ,తానే సృష్టికర్త ను అని ప్రపంచానికి నిరూపించాడు యెహోవా.
విగ్రహారాధన చెయ్యవద్దని ,విగ్రహాలను నాశనం చెయ్యండిఅని యెహోవా చెప్పిన ఈ మాటలన్నీ అసూయ తోనో ,అహంకారం తోనో చెప్పిన మాటలు కావు ,
అధికారం తో చెప్పే మాటలు.
అసలు యెహోవా ఇన్ని అద్భుతాలు చేశాడా ? నిజమేనా ?మానవులు ఊహించి వ్రాసుకున్న కట్టుకథ కావచ్చేమో అని కొంతమంది విగ్రహారాధికులకు సందేహం రావచ్చు.
అది కూడా చూద్దాం నిజమా ,కాదా అని.
దీనిని బట్టి బైబిల్ లో వ్రాయబడినవి కట్టుకధలు కాదు అని మనకు నిరూపణ అయ్యింది.
సోదోమ ,గోమోర పట్టణాలు కూడ ఈనాటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ యెహోవా సర్వ శక్తి కలిగిన దేవుడు అని సాక్ష్యమిస్తున్నాయి.
కనుక విగ్రహారాధికులు అందరూ పక్షపాతాన్ని పక్కన పెట్టి, ఆలొచన చేసి ,సత్యాన్ని గ్రహించాలి అని ప్రేమ పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.