Thursday, 29 February 2024

సమాధాన పడటం

*ప్రశ్న:-*

*నేను సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నా.,,*
*నా సహోదరుడు నాతో సమాధాన పడకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి..?*

*జవాబు*

ఏం తప్పు చేసి నీవు సమాధానం కోరుకుంటున్నావు ?
నీ సహోదరుడు నీతో సమాధాన పడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది?

సమాధాన కర్తయగు దేవుడు మనతో సమాధాన పడాలని ఆయన చాలా మెట్లు దిగి వచ్చాడు

దేవుడు నీతో సమాధాన పడటం కోసం...
*1.* నీ పాపము నీ మీద మోపడం లేదు *(2కొరిం 5:19)*
*2.* నీ పాపానికి శిక్ష ఆయన విధించడం లేదు 
*3.* నీ పాపానికి పరిహారంగా రాయబారులను పంపించాడు 
*4.* నీ పాపానికి శిక్షవిధించుట కొరకు ఆయన తను వాగ్దానం చేసిన మెస్సియను పంపించాడు
*(రోమా 5:1-11; కొల 1:19-22; ఎఫె 2:14-19)*

సమాధాన పడడానికి రాయబారం చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. 
క్రీస్తు రాయబారం వలన మనము దేవునితో సమాధానపడుచున్నాము,

*లూకా14: 31-32* మరియు ఏ రాజైననూ మరియొక రాజుతో యుద్దము చేయబోవు నప్పుడు తన మీదికి 20,000 మంది తో వచ్చు వానిని, పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా ? 
శక్తి లేని యెడల దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాదానము చేసుకొనచూచును కదా..!

నీ సహోదరుడు నీతో సమాధానపడటానికి నీవేమి ఏమేమి చేశావు ?
చిత్తశుద్దితో సమాధాన పడటం కొరకు ప్రయత్నించు. 
నమ్మకమైన రాయబారిని నియమించుకో.
సమాధానపడటంలో క్షమాగుణము అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది.

రోమా పత్రిక

*రోమా పత్రిక* 

*కాలము* - క్రీ॥శ॥ 57-58
*గ్రంధకర్త* - అపో॥ పౌలు

*రోమాలో సంఘాన్ని స్థాపించినవారెవరు ?*

పేతురు, పౌలు అనే ఇద్దరు అపోస్తలులు రోమాలో హతసాక్షులు గా చేయబడినా వారిలో ఏ ఒక్కరు కూడా స్వయంగా రోమా సంఘాన్ని స్థాపించిన వారు కారు

మరి రోమ సంఘాన్ని ఎవరు స్థాపించారు.?

పెంతుకోస్తు దినాన యెరూషలేము లో మార్పు పొందినవారిలో ఎవరైనా అక్కడ సంఘ ప్రారంభానికి సాధనములుగా ఉండి ఉండవచ్చు (అపో. 2:10)
 లేదా పేతురు, పౌలుల పరిచర్యవలన మార్పు చెందిన వారిలో ఎవరైనా రోమాలో క్రీస్తు సంఘపు ఏర్పాటుకు దోహదపడి ఉండవచ్చు 

*రోమా సంఘంలో సభ్యులు ఎవరు..?*

 సభ్యత్వం ప్రధానంగా అన్యజనులలోనుండి వచ్చిన వారితో కూడినదై యుంది 
(రోమా 1:13; 11:13; 15 15 -16)

అంతకు ముందుగా స్థాపించబడి లోక వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న సంఘములో పరిచర్య చేయాలనే ఆశతో పౌలు ఈ ఉత్తరాన్ని వారికి ముందుగా పంపినట్లు తెలియజేయబడుతుంది (రోమా 1:8) 

*ఎక్కడనుండి వ్రాయబడినది ?*

ఇది కొరింధు నుండి వ్రాయబడింది పాలస్తీనాలోని పేదలైనవారి కొరకు చందా పోగు చేస్తున్న కాలంలో వ్రాయబడింది 
(రోమా 15: 14 -17)

రోముకు వెళ్ళి అక్కడనుండి స్పెయిన్ ప్రయాణం సాగించాలనే సంకల్పంతో ఉన్న దినాలవి. (రోమా 15 :24)
యెరూషలేములో తాను బంధింపబడినందున ఈ ఏర్పాటుకు అంతరాయం కలిగింది

*ఈ ఉత్తరంఎవరి ద్వారా పంపబడినది ?*

కెంక్రేయ నుండి తన స్వకార్యం మీద రోమాకు వెళుతున్న *ఫీబే అను సహోదరి ద్వారా* ఈ ఉత్తరం పంపబడినట్టుంది. (రోమా 16:1)

తాను లోకమందు సందర్శించిన సంఘములోని 26 మంది సహోదర, సహోదరీల పేర్లు ప్రస్తావించాడంటే అక్కడ ఉన్న ప్రజలను తాను ఎంతగా ఎరుగునో మనకు ఆశ్చర్యంగా ఉంటుంది.  

*చర్చనీయాంశం*

*నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును* అనేది ఈ రచన చర్చనీయాంశమైంది

*ఉద్థేశ్యము*

 ఏ భేదము లేకుండా, క్రీస్తు శరీరమైన సంఘములో ఏకశరీరంలోని అవయవాలుగా బంధింపబడి ఉండాలనేది ఈ రచన ఉద్దేశ్యమై ఉంది.

 అందరూ ఆ శరీరంలో ఏకముగా క్రీస్తు ప్రభువు యొక్క సమరూపానికి మార్చబడాలి. 
ధర్మ శాస్త్రము వలన యూదులు, అన్యజనులనే భేధము, దానివలన కలిగిన ద్వేషము క్రీస్తు శిలువయందు అంతము చేయబడి, పాపము సకల జనులను ఏకముగా కట్టి పడవేసి నందున అందరూ క్రీస్తునందు ఏక శరీరమునకు మల్చబడిన వారై ఉంటారు


బైబిల్ అంటే...

*బైబిల్ మాత్రమే దేవుని గ్రంధమా* . . .


బైబిలు (Bible) అనే పేరు "బిబ్లోస్" అనే గ్రీకు రూపంనుండి వచ్చింది.

బిబ్లోస్ అనే పదానికి - గ్రంథమని అర్ధం. ప్రాచీన సాహిత్యంలో యింతకు మించిన గ్రంథం లేదనే భావంతోనూ, గ్రంథమని పిలువబడే ధన్యత దానికి మాత్రమే చెందుతుందనే ఉద్దేశంతోనూ, దాన్ని"బైబిల్" లేక గ్రంథం అని అన్నారు.


 రామాయణం, మహాభారతం, మహాభాగవతం అనేవి గ్రంథాల పేర్లు, కాని బైబిలనేది గ్రంథం పేరు కాదు. తిరిగి చెప్పాలంటే - అసలు గ్రంథమనబడేది అదేనట - అందుకే దాన్ని బైబిలన్నారు.


బైబిలు 66 పెద్ద, చిన్న ప్రత్యేక రచనల చేరికయై ఉండి కూడా ఏక గ్రంథంగా భావించబడడమే దాని ప్రత్యేకత. 

అంటే బైబిలు రచనలో సుమారు 40 మంది కలాలు ఆడినా, 

ఒకని రచనగానే అది భావింపబడడం వింతయే! రమారమి 1600 సంవత్సరాల కాలం రచనలో ఉండి కూడా ఒకే సమయంలో వ్రాయబడినట్టు భ్రమింపజేసే గ్రంథం బైబిలు. ఎన్ని దేశాలను, నాగరికతలను అది దాటివచ్చినా, ఎన్ని కలాలు అందులో ఆడినా, ఏ యే కాలాలలో అది వ్రాయబడినా, నేటి ప్రజల పరిస్థితులకు కూడా దాని సందేశం "వర్తిస్తుంది" అనేది ప్రసంశనీయం. ఇలాటి బైబిలంటే....*


బైబిలు క్రైస్తవ మత గ్రంథమనే తలంపు అనేకుల్లో గూడుకట్టుకొని ఉంది. అయితే అది సరియైన తలంపా? కాదు. అయినా, వాటిని మతాలని పిలవడం సమంజసమైతే రెండు వేర్వేరు మతాలకు చెందియూ, ఒకే గ్రంథంగా రూపొందింది - బైబిలు. అంటే, యూదులు, క్రైస్తవులనే రెండు వేర్వేరు జనాలను మతాలని భావించితే, ఆ రెండింటికి చెందియూ ఏక గ్రంథంగా భావింపబడుతున్న గ్రంథం - బైబిలు.


క్రైస్తవ్యం (Christianity) అనే పేరుతో వాడుకలో ఉన్న మత ప్రపంచాన్ని విమర్శించాలని కంకణం కట్టుకొన్న కొందరు - బైబిలును క్రైస్తవ మత గ్రంథమనే అపోహతోనే దాన్ని చిన్నా భిన్నాలుగా తుంచి, తమకు యిష్టం వచ్చిన చోట అతికించి, బైబిలును అపార్ధం చేశారు. బైబిలును అనుసరిస్తున్నామని చెప్పకొనే కొందరైతే తమకు నచ్చిన చోట చదివి, దాన్ని తమకు వర్తింపజేసికొంటూ అది సరియని అనుకొంటున్నారు. అలా చేయడం వారికి బైబిలునందలి విశ్వాసమో, భక్తో తక్కువై కాదు; కాని బైబిలును గూర్చి వారికి సరియైన అవగాహన లేనందుననే అలాటి పొరపాటు చేస్తున్నారు.


*నిజానికి బైబిలు రెండు వేరైన నిబంధనలతో కూడిన గ్రంథం.*  మొదటిది పూర్వ కాలంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చేసిన నిబంధన. దాన్ని “పాత నిబంధన" అని అంటారు (హెబ్రీ. 8:13). ఇశ్రాయేలీయులు దైవ రాజ్యంగా ఉండడానికే ఆ నిబంధన చేయబడింది (నిర్గమ. 19:3-5). అయితే వారు ఆ నిబంధనను భంగం చేసికొన్నారు (యిర్మీయా 31:32; హెబ్రీ. 8:8-9).


గనుక జరుగవలసిన ఏర్పాటును బట్టి, దేవుడు క్రీస్తునందు మానవాళితో రెండవ నిబంధన చేశాడు. ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనయే దేవుని కడవరి ఏర్పాటు (హెబ్రీ. 1:1-2; 1 పేతురు 1:20; మత్తయి 21:27).


"నిబంధన" అంటే ఒప్పందం కదూ! దేవునికి మానవాళికి జరిగే చివరి ఒప్పందం క్రీస్తు రక్తంవల్ల ఏర్పడింది (లూకా 22:20), సామాన్యంగా రాజు తన మాట యిస్తేనే చాలు. దాన్ని అమల్లో పెట్టడానికి అవసరమైతే తన అధికారమంతటిని వినియోగిస్తాడు. ఒకవేళ అలాటి రాజు తన రక్తంతోనే ఒక ఒప్పందానికి సంతకం చేస్తేనో?! అది ఎంతో శ్రద్ధగా అమల్లో ఉంటుంది. ఒక రాజు తన రక్తంతో సంతకం చేసిన ఒప్పందం ఎలాటిదో క్రొత్త నిబంధన కూడా అలాటిదే (హెబ్రీ. 7:15-16). నీవేమనుకున్నాసరే! క్రీస్తుయేసు మాత్రం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్న మాట వాస్తవం (ప్రకటన 19:16). ఆయన రక్తం క్రొత్త నిబంధనను ముద్రించియుండగా, దైవ మానవుల సంబంధ బాంధవ్యాలు కేవలం ఆ నిబంధన మీదనే ఆధారపడి ఉంటాయ్ (యోహాను 12:48-50). 


పాపక్షమాపణ (ఎఫెసీ. 1:7; అపొ. 2:37-38);

పరిశుద్ధాత్మ అను వరం (ఎఫెసీ. 1:13-14),

ప్రార్థనలకు ప్రతిఫలం (గలతీ. 4:4-6; యోహాను 15:7); 

పరలోక పౌరత్వం (ఫిలిప్పీ. 3:20); 

దైవ సహవాసం (1 కొరింథీ. 1:9; 1 యోహాను 1:3);

నిత్య జీవార్ధమైన నిరీక్షణ;

నిత్య స్వాస్థ్యం మొదలైన దీవెనలన్నిటిని అనుభవించడానికి నేటి మానవుడు సయితం ఆ క్రొత్త నిబంధనకే తిరిగి రావాలి! ఇది పరలోక రాజ్యపు రాజ్యాంగ చట్టం. క్రీస్తు యేసే ఈ రాజ్యానికి రాజు. క్రొత్త నిబంధన క్రిందనున్నవారే ఆయన ప్రజలు; పరలోకం వారి దేశం; భూమిమీద వారు యాత్రికులు - పరదేశులు (1 పేతురు 2:9-11). వారు భూమిమీద జీవించే దినాల్లో తమ ప్రభువును బట్టి భౌతిక అధికారాలకు లోబడి ఉంటారు (రోమా 13:1-6). 


అలాటప్పడు బైబిల్లో ఉన్న పాత నిబంధన ఎందుకు? దానివలన ప్రయోజనమేమి? అని అడుగుతావేమో! పాత నిబంధన లేఖనాలు దైవావేశంవలన కలిగినవే (2 పేతురు 1:20-21; 2 తిమోతి 3:16) అవి “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్ప దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నవి." పైగా క్రీస్తు ప్రభువు ఎవరో (యోహాను 1:45; లూకా 24:44-46); క్రొత్త నిబంధన ఎందుకు ఎలా వచ్చిందో తెలిసికోడానికి అవి సహాయపడతాయి (యిర్మీయా 31:31-84) అంతేకాదు, దేవుని మాటలపై ఎలా నిరీక్షణ కోల్పోకుండా ఉండాలో కూడా అవి సూచిస్తాయ్ (రోమా 15:4). దైవ రాజ్యంగా ఉండకుండ పడిపోయిన ఇశ్రాయేలీయుల్లా మనం ఉండకూడదని మనకు బుద్ది కలగడానికి అవి ఉన్నాయ్. అంటే, వారిలాగా మనం చెడ్డవాటిని ఆశింపకూడదని; విగ్రహారాధకులమై ఉండ కూడదని; ప్రభువును శోధింప కూడదని; సణగ కూడదని వారికి దృష్టాంతములుగా సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడ్డాయ్ (1 కొరింథీ. 10:5).


అంతేగాని ఒకేసారి ఆ రెండు నిబంధనల క్రింద కట్టుబడి ఉండడానికి బైబిలు యివ్వబడలేదు. “కాబట్టి మనము విశ్వాసమూలముననీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్రము (పాత నిబంధన) మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడియా యెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద (పాత నిబంధన క్రింద) ఉండము' (గలతీ. 3:24-25; 5:1-2). ఈ వాస్తవం తెలియనందున కూడా అనేకులు బైబిలును అపార్థం చేసికొనడం జరిగింది.


ఏదియెలాగున్నా దేవుని వద్ద ఆత్మసంబంధమైన ఏ దీవెన పొందాలన్నా ప్రతివాడు ఈ క్రొత్త నిబంధన క్రిందికే రావాలి, ఎవరు ఎలా తలంచినా, దానికి బయట దైవ మానవ నివాస సంబంధాలు నిజంగానే లేవు. *ఈలాటి బైబిలు కేవలం మత గ్రంధము అవుతుందా?* 


సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి..!!!

ఫిలిప్పీ పత్రిక background

*ఫిలిప్పు పత్రిక Back ground*

చెర పత్రికలు 4 

1. ఫిలిప్పి
2. ఎఫెసు
3. కొలస్సీ
4. ఫిలేమోను

అపోస్తలుడైన పౌలు రోమా చెరలో ఉండి రాసిన పత్రికలు ఈ 4.

 అపోస్తులుడైన పౌలు రోమా లో చెరపట్టబడి, చెరసాలలో ఉంచడానికి అతను ఏ నేరము చేసిన వాడు కాడు.
యూదులకు పౌలు చేసిన బోధ నచ్చలేదు.
ధర్మశాస్త్రానికి అతీతమైన అనాది దేవుని నిత్య సంకల్పము నకు సంబంధించిన భోధను వారు అంగీకరించలేదు.

కనుక సహస్రాధిపతి పౌలును బంధించెను. అతనిని చంపాలని కొందరు ప్రయత్నిస్తుంటే.. అతనిని దాచిపెట్టెను.

పౌలు పుట్టుకతో రోమీయుడు. అతని ప్రాణం కాపాడడం సహస్రాధిపతి యొక్క బాధ్యత.
 సహస్రాధిపతి రోమా పౌరసత్వం కొన్నవాడు. పౌలు పుట్టుకతోనే రోమీయుడు.

 కైసరు లో గవర్నర్ ఉంటాడు. సహస్రాధిపతి పౌలును అక్కడికి తరలించి, గవర్నర్ చేతికి అప్పగించాడు. గవర్నర్ ఫేలిక్సు - కొత్త గవర్నర్ ఫేస్తుకు అప్పగించాడు. కొత్త గవర్నర్ ను చూడటానికి అక్కడకు అగ్రిప్ప రాజు వస్తాడు.

 రోమ పౌరులకి కైసరు దగ్గర విచారించబడే అవకాశం ఉంది. కైసరు వద్ద అంటే సుప్రీం కోర్ట్ తో సమానం
 
*ఫిలిప్పు 4: 21-22*
కైసరు ఇంటిలోనివారు పరిశుద్ధులు అయ్యారు. కైసరు ఇంటిలోనికి సువార్త దూరడమా..? ఎలా ?

 నీరో చక్రవర్తి పౌలును హౌస్ అరెస్ట్ చేసి తన బాడీగార్డులను పౌలుకు కాపలాగా ఉంచెను. సైనికులు పౌలును సంకెళ్ళతో బంధించెను.
*పౌలు బంధింపబడెను. సువార్తకూడా బంధింపబడియుండెనని అందరూ తలంచారు.*

 కానీ నీరో తన బాడీగార్డులైన సైనికులను పౌలు వద్ద కాపలాకు పంపించేవాడు. వారు అతనివద్ద గడిపిన సమయములో పౌలు దేవుని రాజ్యమునకు సంబంధించిన విషయాలు వారికి చెప్తుండేవాడు. ఆలాగున సువార్త కైసరు ఇంటిలోనికి వెళ్ళి, అక్కడ సంఘంఏర్పడీంది.

*ఫిలిప్పులో సంఘం ఎలా ప్రారంభమైంది.,?*

ఫిలిప్పులో యూదులు ఉండరు. అది రోమా సైన్యానికి కేంద్రస్ధానం వంటిది, 
స్త్రీలలో కొందరు నదిఒడ్డున కూడుకునేవారు. 
అక్కడికి పౌలు, శీల వెళ్ళి భొధించేవారు. 
లూదియ అను (తుయతైర పట్టణస్దురాలు) ఫిలిప్పు పట్టణంలో వ్యాపారానికి వచ్చినది, ఆమె హృదయం తెరువబడి, ఆమె యేసును అంగీకరించినది. ఆమె ఇంటివారు రక్షణలో ప్రవేశించారు
రెండవ కుటుంబము చెరశాల నాయకుడు కుటుంబము.

అలా అభివృద్ది చెంది, సంఘంలో పెద్దలు ఏర్పడే స్ధాయికి ఎదిగీన సంఘం ఫిలిప్పు సంఘం. 
అక్కడ అధ్యక్షులు, పరిచారకులు, పరిశుద్దులు, ఏర్పడ్డారు. ఆత్మీయంగా అత్యంత అభివృద్ది చెందిన సంఘం ఇది. లోపం లేని సంఘం ఇది.

పౌలు రోమా చెరలో బంధింపబడి ఉన్నాడని ఫిలిప్పుసంఘం తెలుసుకుని, పౌలును చూడటానికి ఎఫప్రొదితుకు కొన్ని ప్రేమపూర్వకమైన కానుకలు ఇచ్చి సంఘం ఇచ్చి పంపిస్తుంది.

ఎఫప్రొదితు తో పౌలు - నేను ఏకొదువ లేకుండా ఉన్నానని చెప్పి, *పౌలు బంధింపబడినా సువార్త బంధింపబడలేదు. అనే విషయం వివరిస్తూ వ్రాసిన పత్రికే ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక.,*

ఫిలిప్పు సంఘం Advanced గా బలపడిన, స్దిరపడిన సంఘం, లోపం లేని సంఘం.


ఎఫెసీ పత్రిక background

*ఎఫెసి పత్రిక - BACK GROUND*

 పౌలు ఆసియాలో కాలు పెట్టాడు అంటే.. ఎఫెసులో కాలు పెట్టాడు అని అర్థం

 అపోస్తులులు 16 : 6 ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్దాత్మ వారిని ఆటంకపరచు నందున...
 ఇక్కడ ఆసియా అంటే ఆసియా ఖండము కాదు రోమ్ యొక్క ఆసియా.. రోమ్ సామ్రాజ్యంలో ఆసియా ఒక రాష్ట్రం

 అపోస్తలులు 20 :18 నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడచుకొంటినో మీరే ఎరుగుదురు 

పౌలు ఆసియాలో వాక్యము చెప్పకమునుపు మాసిధోనియాలో సువార్త ప్రకటించాడు
మాసిదోనియా లో మూడు పట్టణాలు ఉన్నాయి 
1. ఫిలిప్పి (ఇది మాసిదోనియా కేంద్రం)
2. థెస్సలోనికయ
3. బెరయ
  ఈ మూడింటిని పౌలు యొక్క ఆసియా అని కూడా అంటారు 

పౌలు యొక్క ఆసియా అనగా దీనిలో 3 పట్టణాలు ఉన్నాయి
1. ఎఫెసి
2. కొలస్సి
3. లవొదెకియా
ఈ మూడింటిని పౌలు యొక్క ఆసియా అంటారు

 పౌలు ఆసియాలో కాలు పెట్టాడు అంటే ఎఫెసులో కాలు పెట్టాడు అని అర్థం ఆసియాలో సువార్తకు ఎఫెసి కేంద్రం గా ఎంచుకొన్నాడు.
ఎఫెసులో మూడు సంవత్సరాలు నివాసం చేసాడు 
పౌలు దీర్ఘకాలం ఎక్కడా లేడు

 పౌలు ఎఫెసు నాకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితి ఎలా ఉందంటే ఎఫెసి విగ్రహారాధనకు కేంద్రముగా ఉండేది 
అక్కడి ప్రజలు ఆర్తిమీదేవి అనే దేవతను కొలిచేవారు
ఆసియా అంతటి నుండి ముఖ్యంగా ఎఫెసినుండి అత్యధికముగా యాత్రికులు వచ్చేవారు 
అర్తెమీదేవి బొమ్మలు అత్యధిక సంఖ్యలో క్రయ విక్రయాలు జరిగేది.
 ఈ బొమ్మల తయారీ, అమ్మకం అత్యధికంగా ఉండడంవల్ల ఆ వ్యాపారం వృద్ధి పొందింది అపోస్తులుడైన పౌలు ఎఫెసు రాకముందు పరిస్థితి ఇది 

అపోస్తలుడైన పౌలు వచ్చిన తరువాత యాత్రికుల రాక తగ్గినది బొమ్మల కొనుగోలు తగ్గిపోయింది 
దానిని నిర్వహించిన వారు ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది.
 పౌలు మాటలు కారణంగా, బోధలకారణంగా తమ వ్యాపారం దెబ్బతిన్నదని వారు భావించడం వల్ల అక్కడ అల్లర్లు జరిగాయి.
పౌలును చంపాలనే ఆలోచనతో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే దేవుని కృప, కనికరము పౌలును కాపాడింది.

చెర పత్రికలు

*చెర పత్రికలు - 4*

1. ఫిలిప్పి
2. ఎఫెసి
3. కొలస్సి
4. ఫిలేమోను

అపోస్తులుడైన పౌలు పౌలు రోములో గృహ నిర్బంధంలో ఉన్నాడు. అతని దగ్గరకు రోమా సైనికులు (soldiers) డ్యూటీ ప్రకారం వచ్చి, అతని దగ్గర ఉంటారు 
ఆ సమయంలో పౌలు
ఫిలిప్పి  
ఎఫెసి,
 కొలస్సి,
 ఫిలేమోను
 అను పత్రికలు వ్రాసాడు
 ఈ 4 పత్రికలు joint ventures గా మనకు కనిపిస్తాయి..

*ఫిలేమోను* ఇంటిలో కొలస్సీ సంఘం కూడుకొంటుంది.
ఫిలేమోను ఇంటిలో *ఒనేసీము* అనే బానిస ఉండేవాడు.
తను రోమ్ కు వెళ్లి తనను తాను స్వాతంత్రం ప్రకటించుకుని రోమ్ లో తిరుగుతున్న కాలంలో జైలులో పౌలును కలుసుకుంటాడు 

ఒనేసీము జైలులో బందీగా ఉన్నప్పుడు క్రీస్తు లోనికి కన్వర్ట్ అయ్యాడు.
ఒనేసిమును క్రీస్తు లోనికి కన్వర్ట్ చేసి, తన దగ్గర ఉంచుకోవడం న్యాయం కాదని భావించిన పౌలు అతనిని యజమాని దగ్గరకు పంపడమే భావ్యమని,
ఆసియాలో ఉన్న *తుకికు* అనే సహోదరుని ద్వారా ఒనేసిమును కొలస్సీ సంఘము లో ఉన్న ఫిలేమోను వద్దకు పంపడానికి ఉద్దేశిస్తూ అక్కడి స్థానిక సంఘమునకు ఒక పత్రిక వ్రాసి, 

అదే సమయములో ఫిలేమోనుకు పర్సనల్ గా మరో లెటరు వ్రాసి, పంపిస్తాడు
అదే ఫిలేమోను కు వ్రాసిన పత్రిక

ఒనేసీము ఒక్కడినే పంపిస్తే ఫిలేమోను దగ్గరకు వెళతాడు లేదో అనే సమస్య ఒక ప్రక్క,, ఫిలేమోను ఒనేసిము చేర్చుకుంటాడు లేదో నని మరో ప్రక్క, ఫిలేమోను అంగీకరిస్తాడో లేదో అని తుకికు ద్వారా ఒనేసిమును అప్పగించి అతనిని చేర్చుకునే టట్లుగా ఫిలేమోనుకు ఒక లెటరు వ్రాస్తాడు.

కొలస్సి సంఘమును ప్రారంభించినవాడు *ఎఫఫ్రా*

రోమ్ లో ఎఫఫ్రా జైలులో పౌలు దగ్గర ఉన్నాడు. 
కొలస్సి సంఘంలో సమస్యలు పరిష్కరించే ఉద్దేశ్యంలో వ్రాసిన ఉత్తరం కొలస్సి పత్రిక 

కొలస్సి వెళ్ళాలి అంటే 
ఎఫెసు మీదుగా వెళ్ళాలి అందువల్ల ఎఫెసియులను జ్ఞాపకం చేసుకొని, ఆ సంఘ పెద్దలు తనపై చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని, ఇక మీరు నా ముఖము చూడరు అనే మాట, వారి ఏడ్పును జ్ఞాపకము చేసుకొని, ఎఫెసీయులకు మరొక పత్రిక వ్రాయడం జరిగింది 

ఈ మూడు లెటర్లు తుకికు ద్వారా ఎఫెసీయులకు, కొలస్సియులకు, ఫిలేమోనుకు ఈ మూడు పత్రికలు వ్రాసి, ఒనేసీమును ఇచ్చి పంపడం జరిగింది...

పై విషయాలన్నీ ఈ క్రింది వచనాలలో మనము చూడగలము..

కొలస్సి 4:7-9; 
ఫిలేమోనుకు 1:8-12
కొలస్సి 1:7
ఫిలేమోను 1:1-3
ఎఫెసి 6:21


పౌలు ఎఫెసు పరిచర్య ఫలితాలు


*పౌలు ఎఫెసు పరిచర్య ఫలితాలు*

*పౌలు ఎఫెసులో మూడు సంవత్సరములు సువార్త ప్రకటించడం వలన వచ్చిన ఫలితాలు*

*1. మొదటి రిజల్ట్*
అపో. 19:23-40
 అర్తెమీదేవి బొమ్మల వ్యాపారం తగ్గిపోయింది. *విగ్రహారాధన తగ్గీనది*

*2. రెండవ రిజల్ట్*
అపో. 19:18-20
*మాంత్రిక విద్యను* అభ్యసించిన అనేకమంది ఆవిద్యను అభ్యసించడం *మానుకున్నారు*. తమ మంత్రవిద్యకు సంబంధించిన పుస్తకాలు తెచ్చి, అందరిఎదుట వాటిని కాల్చివేసి, తగులబెట్టారు. వాటివిలువ 50,000 వెండిరూకలు.

*3. మూడవ రిజల్ట్*
అపో. 19:11-17
రోగులు స్వస్దతపొందిరి, దయ్యములు పట్టినవారు స్వస్ధతపడిరి.. *యేసునామము ఘనపరచబడెను*

*4. నాలుగవ రిజల్ట్*
అపో 19:8-10
పౌలు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచుండెను. *ఆసియాలో కాపురమున్నవారందరూ ప్రభువువాక్యము వినిరి.*

*5. ఐదవ రిజల్ట్*
అపో.19:1-5
యోహాను బాప్తీస్మం సరికాదని ప్రజలు తెలుసుకుని, యేసునందు విశ్వాసముంచి, మారుమనస్సువిషయమైన బాప్తీస్మము తీసుకోవలెనని చెప్పెను. వారు *యేసు నామమున బాప్తీస్మం పొందిరి.*

మనము అనేక సంవత్సరాలనుండి ఒకే ప్రదేశంలో సువార్త పరిచర్యను కొనసాగిస్తున్నాము. ఎలాంటి ఫలితాలు ఎలా వస్తున్నాయి..? 
మన చుట్టుప్రక్కల వారిపై మన ప్రభావం ఏలా పనిచేస్తుంది..?
మన రిజల్ట్ ఎలా ఉంది ? మనము పరిశీలించుకోవాలి

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...